E-Paper
Advertisement

Trump Deportation Indians: అమెరికాలో లక్షల సంఖ్యలో భారత అక్రమ వలసదారులు.. ట్రంప్ అందరినీ ఇండియా పంపగలారా?

Trump Deportation Indians: అమెరికాలో లక్షల సంఖ్యలో భారత అక్రమ వలసదారులు.. ట్రంప్ అందరినీ ఇండియా పంపగలారా?
Advertisement

Trump Deportation Indians: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), తన ఎన్నికల వాగ్దానాల ప్రకారం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారిని అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌గా నిలిచింది. ఈ ప్రక్రియలో భాగంగా, అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయులను మిలిటరీ విమానం సీ-17 ద్వారా తిరిగి ఇండియా పంపుతున్నారు. మొదటి బ్యాచ్‌గా 205 మంది భారతీయులతో మంగళవారం టెక్సాస్‌ నుంచి బయల్దేరిన విమానం పంజాబ్‌లోని అమృత్సర్‌ చేరుకోనుంది. అమెరికాలో ఎంత మంది భారతీయ అక్రమ వలసదారులు ఉన్నారు? ఈ చర్యపై భారత విదేశాంగ శాఖ ఏమంటోంది? ట్రంప్ చర్యలను ధిక్కరించిన దేశాల పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశీలిద్దాం.

అక్రమంగా అమెరికాలో ఉన్న వలసదారులందరూ తమ దేశాలకు తిరిగి వెళ్లాలని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తెలిపారు. ఈ దిశగా అమెరికా ప్రభుత్వం చర్యలను తీవ్రతరం చేసింది. సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య,  సైనిక విమానాలను ఉపయోగిస్తోంది. ఈ నిర్ణయం వేలాది భారతీయులపై ప్రభావం చూపుతుందని అంచనా.

Advertisement

అమెరికాలో ఎంత మంది భారతీయ అక్రమ వలసదారులు ఉన్నారు?
అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో 18,000 మందిని తిరిగి భారతదేశానికి పంపేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. ఈ 7.25 లక్షల మందిలో ఎక్కువమంది వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటున్నారు.

ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను బహిష్కరించి, వారి దేశాలకు తిరిగి పంపేందుకు పెంటగన్ చర్యలు చేపట్టింది. సైనిక విమానాల్లో ఇప్పటికే గ్వాటెమాల, పెరూ, హోండురాస్ వంటి దేశాలకు అక్రమ వలసదారులను తరలించాయి.

Advertisement

Also Read: ప్రపంచంపై ట్రంప్‌ వాణిజ్య యుద్ధ ప్రభావం.. సుంకాలతో ధరల మోత

ఈ చర్యపై భారత్‌ స్పందన ఏమిటి?
సరైన పత్రాలు లేకుండా ఇతర దేశాలకు వలస వెళ్లి, తిరిగి భారత్‌కు రావాలనుకునే వారిని స్వీకరించేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) గత నెలలో స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి పంపదగిన అక్రమ వలసదారుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా నిర్ణయించబడలేదని ఆయన తెలిపారు.

‘‘మేము ఎప్పుడూ చట్టబద్ధమైన వలసలకే మద్దతు ఇస్తాము. భారతీయుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు, అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాము. అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాము’’ అని జైశంకర్ వాషింగ్టన్‌లో వ్యాఖ్యానించారు. ‘‘మా దేశ పౌరులు ఎవరైనా అక్రమంగా వలస వెళ్లినట్లు గుర్తించబడితే, వారు నిజంగా భారత పౌరులైతే, వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వీకరించేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశాం’’ అని ఆయన తెలిపారు.

ట్రంప్ చర్యలను ధిక్కరించిన దేశాల పరిస్థితి ఏమిటి?
ట్రంప్ ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని ఏ దేశమైనా ధిక్కరిస్తే, అమెరికా ఆ దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ (Mike Johnson) గత వారం మాట్లాడుతూ, సరైన పత్రాలు లేని వలసదారులను బహిష్కరించేందుకు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తే, అమెరికా కాంగ్రెస్ ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు.

ఈ విషయంలో కొలంబియా అమెరికాను వ్యతిరేకిస్తే ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిస్పందనగా, కొలంబియా ఉత్పత్తులపై 25% సుంకం విధించింది. తర్వాత కొలంబియా తన స్టాండ్‌ను మార్చుకోవడంతో, అమెరికా ఆంక్షలను ఎత్తివేసింది. అదేవిధంగా, మెక్సికో, కెనెడా వంటి దేశాలపై కూడా సుంకాల ద్వారా ఒత్తిడి చేసిన ట్రంప్, తాజాగా ఆ దేశాలకు కొంత ఉపశమనం కల్పించారు. ఈ దేశాలు అమెరికా సరిహద్దుల వద్ద భద్రతను మెరుగుపరచడంతో, టారిఫ్‌లను (US Tariffs) నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×