E-Paper
Advertisement

India China Border : భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధం.. తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణపై చైనా ప్రకటన

India China Border : భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధం.. తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణపై చైనా ప్రకటన
Advertisement

India China Border : భారత్‌- చైనాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి చర్చనీయాంశమైన వేళ.. ఇరుదేశాల సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత స్థిరమైన, పటిష్ఠమైన సంబంధాల దిశగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని చెప్పారు.

దౌత్య, సైనిక మార్గాల ద్వారా చైనా, భారత్‌లు.. నిరంతరాయంగా చర్చలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయని ప్రకటన ఇచ్చారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు స్థిరమైన, బలమైన వృద్ధి దిశగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఇటీవల భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న వేళ తాజా ప్రకటన వెలువడింది. సరిహద్దుల వద్ద యథాతథ పరిస్థితిని చైనా ఏకపక్షంగా మార్చాలని చూసిందని, ఈ చర్యలను భారత సైనికులు అడ్డుకొన్నారంటూ తవాంగ్‌ ఘర్షణపై గత వారం భారత్ స్పందించింది.

ఈ పరిణామాల నడుమ ఈనెల 20న చుశుల్‌ – మోల్డో సరిహద్దు ప్రాంతంలో చైనా భూభాగంలో 17వ విడత భారత్‌- చైనా కోర్‌ కమాండర్‌ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అయితే, ఎలాంటి నిర్దిష్టమైన నిర్ణయాలు వెలువడలేదు. మధ్యంతర పరిష్కారంగా పశ్చిమ సెక్టార్‌లో ప్రస్తుతం ఉన్న భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించాలని ఇరు దేశాల సైనికాధికారులు నిశ్చయించారు.

Tags

Related News

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Big Stories

Advertisement
×