E-Paper
Advertisement

Indian Student dies at London: భర్తకు కొద్దిదూరంలో.. లండన్‌లో భారతీయురాలు మృతి!

Indian Student dies at London: భర్తకు కొద్దిదూరంలో.. లండన్‌లో భారతీయురాలు మృతి!
Advertisement
India PhD student dies after being run over by truck in London
India PhD student dies after being run over by truck in London

Indian Student dies at London: లండన్‌లో దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన చేష్టా‌కొచ్చర్ మృతి చెందారు. మార్చి 19న సైకిల్ తొక్కుతూ సెంట్రల్ లండన్ నుంచి ఇంటికి వస్తుండగా మధ్యలో ఓ ట్రక్కు ఢీ కొట్టింది. తీవ్రగాయాలపాలైన చేష్టా అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి కూతవేటు దూరంలో చేష్టా భర్త ప్రశాంత్ ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

చేష్టాకొచ్చర్ సొంతూరు హర్యానాలోని గురుగ్రామ్. సెప్టెంబర్‌‌‌లో పీహెచ్‌డీ కోసం లండన్‌కు వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్సిటీలో చదువుకున్నారు. 2021 నుంచి 23 మధ్యకాలం నీతి అయోగ్‌లోని నేషనల్ బహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్‌లో సలహాదారుగా పని చేసిన అనుభవం ఆమె సొంతం.

Advertisement

చేష్టా‌కొచ్చర్ మృతిపై ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చేష్టా కుటుంబసభ్యుల్లో విషాదం నింపిందని రాసుకొచ్చారు. ఇలా చాలా బాధాకరమని, ప్రస్తుతం తానింకా లండన్‌లో ఉన్నానని తెలిపారు.

Also Read: Gaza Updates: రంజాన్ వేళ ఐరాస భద్రత మండలి తీర్మానం.. గాజాలో కాల్పుల విరమణకు ఆదేశం

Advertisement

మరోవైపు చేష్టా మృతిపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్‌కాంత్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూనే.. ఆమె ఎంటో దైర్యవంతురాలని నాతో కలిసి చేశారని చెప్పుకొచ్చారు. ఇంత త్వరగా ఆమె మన నుంచి దూరంకావడం బాధాకరమన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×