E-Paper
Advertisement

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు
Advertisement

Indian bus fall at river in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పలువురు గల్లంతు అయినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఘటన సమయంలో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ ఘటన తనహున్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు.. పోఖరా నుంచి ఖాట్మండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక సైడ్ అంతా కొండ.. మరోవైపు నది ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదం దాటికి బస్సు పైటాప్ ఎగిరి నదిలో పడింది.

ALSO READ: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం..9 మంది మృతి

Advertisement

యూపీ ఎఫ్‌టీ 7623 నెంబరు గల బస్సు అని నేపాల్‌లోని  తనహ్యూ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. బస్సు ప్రమాదం విషయం తెలియగానే యూపీ రిలీఫ్ కమిషనర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన బస్సులో యూపీకి చెందినవారు ఎవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

నేపాల్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భారీ వర్షాలు కొండచరియల కారణంగా రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెల్సిందే.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×