BigTV English

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు

Indian bus fall at river in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పలువురు గల్లంతు అయినట్టు తెలుస్తోంది.


సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఘటన సమయంలో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ ఘటన తనహున్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు.. పోఖరా నుంచి ఖాట్మండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక సైడ్ అంతా కొండ.. మరోవైపు నది ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదం దాటికి బస్సు పైటాప్ ఎగిరి నదిలో పడింది.


ALSO READ: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం..9 మంది మృతి

యూపీ ఎఫ్‌టీ 7623 నెంబరు గల బస్సు అని నేపాల్‌లోని  తనహ్యూ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. బస్సు ప్రమాదం విషయం తెలియగానే యూపీ రిలీఫ్ కమిషనర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన బస్సులో యూపీకి చెందినవారు ఎవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

నేపాల్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భారీ వర్షాలు కొండచరియల కారణంగా రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెల్సిందే.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×