E-Paper
Advertisement

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు
Advertisement

S JAI SHANKER : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో జైశంకర్ చైనా పాకిస్తాన్‌లపై విరుచుకుపడ్డారు. దేశాల మధ్య సహకారం పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని సూచించారు. పాక్‌కు చెందిన షెహబాజ్ షరీఫ్, చైనీస్ లీ కియాంగ్ సమక్షంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షఇస్లామాబాద్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్​సీవో) సదస్సు జరుగుతోంది. అయితే భారత ప్రతినిధి బృందానికి భారత విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) జైశంకర్‌ సారథ్యం వహించారు.

Advertisement

సదస్సులో భాగంగా మాట్లాడిన ఎస్ జైశంకర్ తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పరోక్షంగా ఆతిథ్య దేశానికి, పొరుగున ఉన్న డ్రాగన్ దేశానికి నర్మగర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.

సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఇక వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ లాంటి అంశాల్లో సహకారం వృద్ధి ఎలా ఉంటుందని నిలదీశారు.

Advertisement

దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం, స్నేహం లోపించకూడదని, ఒకవేళ అవి లేకపోతే ఆయా దేశాలతో సత్సంబంధాలు కూడా తెగిపోతాయన్నారు.

దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై స్నేహం ఆధారపడి ఉండాలన్నారు. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. అప్పుడే ఎస్​సీఓ సభ్య దేశాలు ప్రయోజనం పొందుతాయున్నారు.

రెండు రోజుల సదస్సును బుధవారంతో ముగించుకున్న జైశంకర్ బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే తమకు ఆతిథ్యం ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

also read : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×