E-Paper
Advertisement

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

S Jai Shanker : పాకిస్థాన్‌లో అడుగుపెట్టి.. వారికే చురకలంటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాకూ మొట్టికాయలు

S JAI SHANKER : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో జైశంకర్ చైనా పాకిస్తాన్‌లపై విరుచుకుపడ్డారు. దేశాల మధ్య సహకారం పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలని సూచించారు. పాక్‌కు చెందిన షెహబాజ్ షరీఫ్, చైనీస్ లీ కియాంగ్ సమక్షంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షఇస్లామాబాద్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్​సీవో) సదస్సు జరుగుతోంది. అయితే భారత ప్రతినిధి బృందానికి భారత విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) జైశంకర్‌ సారథ్యం వహించారు.

సదస్సులో భాగంగా మాట్లాడిన ఎస్ జైశంకర్ తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పరోక్షంగా ఆతిథ్య దేశానికి, పొరుగున ఉన్న డ్రాగన్ దేశానికి నర్మగర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.

సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఇక వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ లాంటి అంశాల్లో సహకారం వృద్ధి ఎలా ఉంటుందని నిలదీశారు.

దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం, స్నేహం లోపించకూడదని, ఒకవేళ అవి లేకపోతే ఆయా దేశాలతో సత్సంబంధాలు కూడా తెగిపోతాయన్నారు.

దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై స్నేహం ఆధారపడి ఉండాలన్నారు. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. అప్పుడే ఎస్​సీఓ సభ్య దేశాలు ప్రయోజనం పొందుతాయున్నారు.

రెండు రోజుల సదస్సును బుధవారంతో ముగించుకున్న జైశంకర్ బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే తమకు ఆతిథ్యం ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.

also read : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×