E-Paper
Advertisement

Israel-Palastine War : గాజా నేలమట్టానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్

Israel-Palastine War : గాజా నేలమట్టానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్
Advertisement

Israel-Palastine War : ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ వార్‌లో వేలాది మంది మరణంతో ఆర్తనాదాలు, హాహాకారాలతో మృత్యుఘోషతో విలపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళల పట్ల కూడా హమాస్‌ ఉగ్రవాదులు కణికరం చూపడం లేదు. అమానుషంగా వ్యవహరిస్తూ చేతులకు సంకెళ్లు వేసి వారి తలలను నరికేస్తూ రాక్షసత్వాన్ని వెళ్లగక్కుతున్నారు. అడ్డొచ్చిన వారిని ఎక్కడికక్కడ చంపేస్తుండటంతో భయానక వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం.

ఇలాంటి భీతావహ సమయంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్‌ అజయ్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ మొదటి చార్టర్‌ విమానం 212 మందితో ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానం గురువారం రాత్రి బయలుదేరగా ఈరోజు ఉదయం ఇండియాకు చేరుకుంది. ఇక ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న స్వదేశీయులకు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికి అక్కడి పరిస్థితులు, వారి క్షేమ సమాచారంపై ఆరా తీశారు. స్వదేశానికి చేరుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మంది ఉన్నారు.

Advertisement

మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నార్త్ గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా టన్నెల్స్ లో దాక్కుని ఉన్న హమాస్ మిలిటెంట్ల కోసమే ఈ రీ లొకేషన్ ఆదేశాలను జారీ చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×