E-Paper
Advertisement

Jaanhavi Kandula: జాహ్నవి మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్..

Jaanhavi Kandula: జాహ్నవి మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్..
Advertisement
jaanhavi kandula death case
jaanhavi kandula death case

Jaanhavi Kandula Death Case: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసు అధికారి కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు ఫిబ్రవరి 22న వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఫిబ్రవరి 24న సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది.

‘జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం. తగిన పరిష్కారం కోసం జాహ్నవి మృతి కేసు గురించి స్థానిక అధికారులు, సియాటెల్‌ పోలీసుల వద్ద గట్టిగా లేవనెత్తాం. సమీక్ష కోసం ప్రస్తుతం ఈ కేసును సియాటెల్‌ అటార్నీ కార్యాలయానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నాం. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని సియాటెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించారు.

Advertisement

Read More: నోరొవైరస్‌తో అమెరికన్ల బెంబేలు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ.. కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం 2024 ఫిబ్రవరి 22న తీర్పునిచ్చింది. సీనియర్‌ అధికారులతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది.

Advertisement

మరోవైపు జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ చెప్పారు. చులకనగా మాట్లాడిన అధికారిపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. అతనిపై తుది విచారణ మార్చి 4న జరగనుందిని తెలిపారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×