Woman Who got Cancer With Johnson’s Baby Powder: జాన్సన్ బేబి పౌడర్ తెలియని వారంటూ ఉండరు. నవజాత శిశువులకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ల ఇంట్లో జాన్సన్ బేబి పౌడర్ ఉండాల్సిందే. అలాంటి దిగ్గజ కంపెనీలు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్ యు కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థల బేబీ పౌడర్ వాడటం వల్ల థెరిసా గ్రేసియా అనే మహిళ కాన్సర్ బారిన పడి మృతిచెందనట్లు షికాగో కోర్టు ఆదేశించింది. దీంతో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 375 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ప్రకటించింది.
అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన థెరిసా గ్రేసియా కొన్నేళ్ల క్రితం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కమ్ పౌడర్ను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దాదాపు ఏళ్ల తరబడి ఈ న్యాయ పోరాటం కొనసాగింది. ఈ పోరాటం చేస్తూనే ఆమే 2020 లో కేన్సర్ తో మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్ యు కంపెనీలుపై కేసు పెట్టారు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది.
Also Read: ట్రాక్ పై నుంచి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి
ఏళ్ల తరబడి కేసు కొనసాగుతుండగా, కేసు విచారణ అనంతరం గత కొద్ది రోజుల క్రితం షికాగో కోర్టు మహిళకు అనుకూలంగా ఈ తీర్పును ఇచ్చారు. గ్రేసియా మరణానికి కెన్వ్యూ 70 శాతం.. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 30 శాతం బాధ్యత వహించాలని షికాగో కోర్టు ప్రకటించింది.