Big Stories

Gurupatwant Singh Pannun | భారత పార్లమెంటుపై త్వరలో బాంబు దాడి చేస్తాం : ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్

Gurupatwant Singh Pannun | అమెరికా సంరక్షణలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తామని చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు.

- Advertisement -

అమెరికా, కెనెడా పౌరసత్వమున్న పన్నూన్‌పై ఇటీవల అమెరికాలో హత్యాయత్నం జరిగింది. అయితే అమెరికా ప్రభుత్వానికి ముందుగానే దీని గురించి తెలిసిపోవడంతో అతను బతికిపోయాడు. ఇదంతా భారత ప్రభుత్వమే చేసిందని.. అమెరికా.. భారతదేశాల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నూన్ ఒక వీడియో విడుదల చేశాడు. తనపై జరిగిన హత్యయత్నానికి ప్రతీకారంగా డిసెంబర్ 13న పార్లమెంటు కొత్తభవనాన్ని పేల్చేస్తామని అన్నాడు.

- Advertisement -

“2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై అఫ్జల్ గురు అనుచరులు దాడి చేశాడు. సరిగా అలాగే నేను కూడా 2023 డిసెంబర్ 13 పార్లమెంటు దాడి చేస్తాను.. కానీ ఈ దాడి ఇంకా భయంకరంగా ఉంటుంది. భారత పార్లమెంటు పునాదులు కదిలిపోతాయి. ఢిల్లీ బనేగా ఖలిస్తాన్” అని పన్నూన్ ఈ వీడియోలో అన్నాడు. వీడియోలో అతని వెనుక పాకిస్తాన్ ఉగ్రవాది అఫ్జల్ గురు పార్లమెంటు ఫొటో పోస్టర్ ఉంది. ఆ పోస్టర్‌పై ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అనే శీర్షిక అని రాసి ఉంది.

పన్నూన్ ఇంతకు ముందు ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రోజున కూడా ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. కానీ అది జరగలేదు. కానీ ఈ సారి అతను సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం అందించాయి. దాడిని అమలు చేయడానికి కొందరు వక్తులను ఉగ్రవాది పన్నూన్ నియమిస్తున్నట్లు తెలిపాయి.

ప్రస్తుతం పార్లమెంటు శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఉగ్ర దాడి బెదిరింపులు రావడంతో భద్రతా ఏజెన్సీలు ఒక్కసారి అప్రమత్తమయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News