BigTV English
Advertisement

Ahlan Modi: ప్రపంచం భారతదేశాన్ని ‘విశ్వ బంధు’గా చూస్తోంది.. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని..

Ahlan Modi: ప్రపంచం భారతదేశాన్ని ‘విశ్వ బంధు’గా చూస్తోంది.. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని..
Indian PM at Ahlan Modi event

Ahlan Modi: మంగళవారం సాయంత్రం అబుదాబిలో జరిగిన భారీ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య పెరుగుతున్న సమ్మేళనం గురించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన “మూడవ పదవీకాలం”లో తీసుకోబోయే నిర్ణయాలను స్పష్టం చేశారు. తాను ఏడవసారి గల్ఫ్ దేశాన్ని సందర్శిస్తున్నాని గుర్తుచేశారు. గల్ఫ్ దేశంతో పెరుగుతున్న వృద్ధికి కారణమైన ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ హామీ ప్రతిసారీ పనిచేస్తుందని వాగ్దానాలు కూడా చేశారు.


వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరైన జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన “అహ్లాన్ మోదీ” కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోదీ హామీ అంటే ప్రతి హామీ నెరవేరుతుందని ప్రధాని ప్రకటించారు.

“భారత్ యూఏఈ మధ్య స్నేహాన్ని ప్రశంసించాల్సిన సమయం ఇది. ఈ చారిత్రాత్మక స్టేడియంలో, ప్రతి హృదయ స్పందన అదే భావాన్ని ప్రతిధ్వనిస్తుంది. లాంగ్ లీవ్ భారత్- యూఏఈ ఫ్రెండ్‌షిప్ ” అని ఇరు దేశాల జాతీయ గీతాలతో ప్రారంభమైన కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు.


డబ్బు బదిలీలు నేరుగా చేసే వ్యవస్థను నిర్మించడానికి భారతదేశం UPIని యూఏఈకి తీసుకెళ్లడం ఒక మార్గం అని ఆయన సూచించారు.

“ఇండాయా రూపే యూఏఈ దేశీయ చెల్లింపు కార్డును అభివృద్ధి చేయడంలో సహాయపడింది. వారు తమ దేశీయ కార్డుకు జీవన్ అని పేరు పెట్టారు. త్వరలో UPI సేవలు ఇక్కడ ప్రారంభమవుతాయి ఇది లావాదేవీని సులభతరం చేస్తుంది. మీరు మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు పంపవచ్చు,” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Read More: పాకిస్థాన్‌లో సంకీర్ణ సర్కార్.. పీఎంఎల్, పీపీపీ మధ్య సయోధ్య..

గత తొమ్మిదేళ్లుగా, వాణిజ్యం, రక్షణ, ఆహారం, ఇంధన భద్రత, విద్య వంటి రంగాలలో యూఏఈ తో భారతదేశ సహకారం పెరిగింది. 2022-23లో సుమారు $85 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో రెండు దేశాలు ఒకదానికొకటి అగ్ర వాణిజ్య భాగస్వాములలో ఉన్నాయని అధికారిక డేటా చూపిస్తుంది.

అయినప్పటికీ, రెండు దేశాల మధ్య బంధం “ప్రతిభ, ఆవిష్కరణ, సంస్కృతి” అని ప్రధాని మోదీ అన్నారు. “గత కొన్ని సంవత్సరాలుగా, మేము మా సంబంధాలకు ఊతమిచ్చాము. యూఏఈ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి,” అని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రవాస భారతీయుల పోషించిన పాత్రకు వారికి మోదీ అభినందనలు తెలిపారు.

ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సఖ్యతకు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని కొనియాడారు. మోదీ పదే పదే తన ప్రసంగంలో యూఏఈ ప్రెసిడెంట్‌ను సోదరునిగా సంభోదించారు.

“యూఏఈలో అతను మిమ్మల్ని చూసుకునే విధానం, మీ ఆసక్తుల గురించి అతను శ్రద్ధ వహించే విధానం గొప్పది. ఇలాంటివి చూడటం చాలా అరుదు. అందుకే ప్రజలు అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ ఉన్నారు. యూఏఈ వారి అత్యున్నత పౌర పురస్కారంతో నన్ను సత్కరించడం నాకు విశేషం. ఇది మీ అందరికీ దక్కిన గౌరవం’’ అని అహ్లాన్ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×