E-Paper
Advertisement

Los Angeles Wildfire : మళ్లీ రగిలిన లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. వేల ఎకరాలు దగ్ధం

Los Angeles Wildfire : మళ్లీ రగిలిన లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. వేల ఎకరాలు దగ్ధం
Advertisement

Los Angeles Wildfire | అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు మరోసారి భారీ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కాస్టాయిక్ లేక్ సమీపంలో ఇటీవల చెలరేగిన మంటలు ఇంకా శాంతించకముందే, తాజాగా మరో ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీని వల్ల దక్షిణ కాలిఫోర్నియాలో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండ ప్రాంతాల్లో మొదలైన ఈ మంటలు కొన్ని గంటల వ్యవధిలోనే 8 వేల ఎకరాలకు పైగా వ్యాపించాయి.

మంటలు వ్యాపించిన ప్రాంతాలు
బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) కాస్టాయిక్ లేక్ సమీపంలో మొదలైన మంటలు కేవలం కొన్ని గంటల్లోనే 39 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని చెట్లను, పొదలను బూడిద చేశాయి. ఇటీవలి కాలంలో అగ్నికి ఆహుతైన పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాలకు ఈ కొత్త మంటలు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు.. మంటల వ్యాప్తిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.

Advertisement

ప్రభావిత ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆదేశాలు
మంటల తీవ్రత దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, ఈ వేగం మరింత పెరిగి 96 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. విమానాల ద్వారా వాటర్ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలి కాలంలో లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో ఘోర కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకున్నాయి. 14 వేల నిర్మాణాలు దగ్ధమవగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలిసేడ్స్, ఏటాన్ ప్రాంతాల్లో మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదని అధికారులు తెలిపారు. అయితే, బలమైన గాలుల కారణంగా మంటలు మళ్లీ తీవ్రమవుతున్నాయి.

Advertisement

నూతన సంవత్సర వేడుకల కారణమా?
ఈ కార్చిచ్చు చెలరేగడానికి నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్చిన బాణాసంచా కారణమని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. బాణాసంచా వల్ల మొదలైన మంటలు గాలుల కారణంగా వేగంగా వ్యాపించాయని రిపోర్ట్ పేర్కొంది.

దొంగల తాకిడి
కార్చిచ్చు వల్ల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయడం ప్రారంభించడంతో, దొంగలు చెలరేగిపోతున్నారు. పాలిసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో, నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. ఇప్పటివరకు 29 మంది దొంగలను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మంటల అదుపు కోసం ప్రయత్నాలు
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఫోస్ చెక్ అనే రసాయనంతో కూడిన ద్రవాన్ని హెలికాఫ్టర్ల సహాయంతో వ్యాపిస్తున్న ప్రాంతాల్లో చల్లుతున్నారు. ఈ పదార్థం గులాబి రంగులో ఉండి మంటల వ్యాప్తిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

మృతుల సంఖ్య పెరుగుతోంది
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటాన్‌లో 18 మంది, పాలిసేడ్స్‌లో 10 మంది మరణించారని సమాచారం. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఈ ఘోర ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×