E-Paper
Advertisement

Mohamed Muizzu | భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు

Mohamed Muizzu | భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న వేళ.. ఆయన భారత దేశం తమ సైన్యాన్ని ఉపసరించుకోవాలని అన్నారు.

Mohamed Muizzu | భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు

Mohamed Muizzu | భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న వేళ.. ఆయన భారత దేశం తమ సైన్యాన్ని ఉపసరించుకోవాలని అన్నారు. మాల్దీవ్స్ రాజధాని మాలేలో భారత దౌత్యాధికారులతో.. మాల్దీవ్స్ అధికారులు ఈ అంశంపై చర్చించారు.
మార్చి 15లోపు భారత సైన్యం తిరిగి వెళ్లిపోవాలని మాల్దీవ్స్ అధికారులు కోరారు.

మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు తన అయిదు రోజుల చైనా పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. ఆయన రాగానే భారత సైనికులను తిరిగి పంపిచే ప్రక్రియ మొదలుపెట్టాలని తన అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. భారత్ నుంచి తీసుకున్న హెలికాప్టర్లను కూడా ఉపయోగించడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భారత్‌తో దౌత్య సంబంధాలపై కూడా మాల్దీవ్స్ అధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

మాల్దీవ్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా 77 మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. సైనిక సహాయంతో పాటు భారతదేశం మాల్దీవ్స్‌కు కానుకగా రెండు హెలికాప్టర్లు, ఒక విమానం కూడా ఇచ్చింది.

అయితే మాల్దీవ్స్‌లో భారత వ్యతిరేక నినాదంతో మహమద్ మొయిజు ఎన్నికలు గెలిచారు. ఆ తరువాత ఇటీవల ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశార. దీంతో భారత దేశంలో కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారంలో సెలెబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ కారణంగా భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×