BigTV English

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు

Nigeria Boat tragedy: మార్కెట్‌కి వెళ్తుండగా పడవ బోల్తా.. 40 మంది గల్లంతు


Nigeria boat tragedy:  నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది వరకు గల్లంతు అయ్యారు. కేవలం 10 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిస్సయినవారి కోసం నదిలో గాలింపు జరుగుతోంది. అసలేం జరిగింది?


ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలకు రోడ్ల సమస్య వెంటాడుతోంది. ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలా దేశాల ప్రజలు నదులు, సముద్రాల మీదుగా ప్రయాణాలు చేయాల్సివస్తోంది. ఆ తరహా ప్రయాణాలు చివరకు వారి ప్రాణాల మీదకు తెస్తోంది. అలాంటి ఘటన ఒకటి నైజీరియాలో చోటు చేసుకుంది.

నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రం నుంచి స్థానిక గోరోన్యో మార్కెట్‌కు 50 మంది ప్రయాణికులతో బోటు వెళ్తోంది. అయితే బరువు ఎక్కువ కావడంతో నది మధ్యలోకి వెళ్లిన తర్వాత బోటులోకి క్రమంగా నీరు రావడం మొదలైంది. నదిలో బోల్తా పడింది. ఘటనలో సమయంలో బోటులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

మార్కెట్ నుంచి దినుసులు తెచ్చుకోవడానికి వీరంతా వెళ్తున్నారు. 10 మంది మాత్రమే సిబ్బంది రక్షించారు. మరో 40 మంది వరకు మిస్సయ్యారు. వారి జాడ తెలియలేదని జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది.  గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆదేశ భద్రతా దళాలు వెల్లడించాయి.

ALSO READ: చైనా సింపతీ.. ట్రంప్ అంతర్యం ఏంటి?

మూడు వారాల కిందట ఉత్తర-మధ్య నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించారు. డజన్ల కొద్దీ మంది గల్లంతయ్యారు. నైజీరియాలో జలమార్గాలపై నియంత్రణ లేకపోవడం వల్ల పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.

వర్షాకాలంలో నదులు, సరస్సులు పొంగి పొర్లుతాయి. గతేడాది ఇదే నెలలో సోకోటో రాష్ట్రంలో నది మీదుగా వరి పొలాలకు తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది రైతులు మరణించారు. అదే ఏడాది జూలై 29న వాయువ్య జిగావా రాష్ట్రంలో వ్యవసాయ పనుల నుండి ఇంటికి తీసుకెళ్తున్న పడవ నది మధ్యలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువతులు చనిపోయారు. రెండు రోజుల కిందట మధ్య నైజర్ రాష్ట్రంలో జరిగిన మరో పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.

Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×