E-Paper
Advertisement

Nawaz Sharif | ‘పాకిస్తాన్ ప్రపంచంలో చాలా వెనుకబడిపోయింది.. పుంజుకోవడం కష్టమే!’

Nawaz Sharif | పాకిస్తాన్ ప్రపంచ దేశాలకంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిందని.. దానిని మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టాయి.

Nawaz Sharif | ‘పాకిస్తాన్ ప్రపంచంలో చాలా వెనుకబడిపోయింది.. పుంజుకోవడం కష్టమే!’
Advertisement

Nawaz Sharif | పాకిస్తాన్ ప్రపంచ దేశాలకంటే ఆర్థికంగా చాలా వెనుకబడిపోయిందని.. దానిని మళ్లీ గాడిలో పెట్టడం అంత సులభం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టాయి. 24 కోట్ల జనాభా గల పాకిస్తాన్‌లో రాజకీయ పార్టీలన్నీ ప్రజల ఓట్లు దక్కించకోవడానికి ఏ అవకాశాన్ని వదలడంలేదు.

ఈ క్రమంలో ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ సోమవారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం మన్‌సెహ్రా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అక్కడ ఓ సభల ప్రసంగిస్తూ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీనస్థితి గురించి మాట్లాడారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని.. దాన్ని మళ్లీ పునర్మించాలని ఆయన చెప్పారు.

Advertisement

గత పదేళ్లలో పాకిస్తాన్‌ని పూర్తిగా నాశనం చేశారని.. పాకిస్తాన్ తెహ్రీకె ఇన్సాఫ్(ఇమ్రాన్ ఖాన్ పార్టీ) దీనికి కారణమని మండిపడ్డారు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసిగించిదన్నారు. ఇంతకుముందు తాను మూడు సార్లు దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశానని.. అప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థను ఎంతో బలోపేతం చేశానని గుర్తుకు చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ రూపాయి కరెన్సీ మారక విలువ అమెరికా డాలర్‌తో పోల్చితే 104 రూపాయలకు ఎప్పుడూ దాటలేదని చెప్పారు. పాకిస్తాన్‌లో కరెంటు కోతలు లేకుండా చేశానని అన్నారు.

మన్‌సెహ్రా నుంచి తాను పోటీచేస్తున్నట్లు.. తనకు ఓట్లు గెలిపిస్తే.. మన్‌సెహ్రా నగరంలో ఒక ఎయిర్ పోర్టు, ఒక యూనివర్సిటీ, అలాగే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నవాజ్ షరీష్ భరోసా ఇచ్చారు.

Advertisement

Nawaz Sharif, admit, rebuild, Pakistan Economy, easy task, Pakistan Muslim League, Mannsehra, Pakistan elections,

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×