Nepal Floods: నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉప్పెనలా విరుచుకుపడ్డ వరద ధాటికి వందలాది మంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ఇళ్లు, భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ దిగ్భ్రాంతికర పరిస్థితుల్లో అక్కడ విచిత్రమైన చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వరదల్లో కొట్టుకు వచ్చిన లాకర్ ను కొందరు దోచుకోగా.. మృతదేహాలపై బంగారాన్ని మరికొందరు దోచుకుంటున్నారు. ఈ ఘటనలు మానవత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
నేపాల్ రసువా (Rasuwa)లోని భోటేకోషి (Bhotekoshi) ప్రాంతంలో సెప్టెంబర్ 10న వచ్చిన వరదల్లో.. ఓ భారీ క్యాష్ సేఫ్ లాకర్ కొట్టుకుపోయింది. ఇది ధాడింగ్ జిల్లా బెల్ఖుఖోలా (Belkhukhola) వద్ద త్రిశూలి నది (Trishuli River) ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే అక్కడి స్థానికులు ఆ సేఫ్ లాకర్ను పగలగొట్టి అందులోని నగదును పంచుకున్నట్లు సెప్టెంబర్ 12న పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందిన వెంటనే ధాడింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చోరీకి పాల్పడిన 29 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారతీయ కరెన్సీ రూ.92,68,505 లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సొమ్ము ఎవరిది? చోరీలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నేపాల్ లో మరో దిగ్భ్రాంతికర ఘటన సైతం వెలుగు చూసింది. నారాయణి నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుండి బంగారు కమ్మలను ఇద్దరు వ్యక్తులు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియో ఆధారంగా ఇద్దరినీ గుర్తించి అరెస్టు చేశారు. మరోవైపు వరదలో దెబ్బతిన్న ఇళ్లల్లోకి వెళ్లి స్థానికులు చోరీకి పాల్పడుతున్నారు. బాధితులు గల్లంతైన ఇళ్లను టార్గెట్ చేస్తూ.. వాటిలోని వస్తువులు, బంగారం తీసుకెళ్తున్నారు.
🇳🇵 2 men have been arrested after viral video showed them allegedly stealing a gold earring from the body of a victim swept away in Nepal’s catastrophic floods.
Police identified the suspects as Madan Gurung, 25, and Umesh Chaudhary, 38, after reviewing the footage, which shows…
— NewsForce (@Newsforce) August 27, 2026
We have seen lot of ugly side of people during crisis looting household items and snatching jewelry from dead bodies, lets not forget good samaritan like this fellow, who has found a handful of gold jewelry in the floods while opening a cupboard that was swept away by the…
— Abhishek Jha (@abhishekjha157) August 28, 2026
ఇదిలా ఉంటే మరో వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన ఇళ్లల్లోని వస్తువులను కొందరు ఎత్తుకెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్, గిన్నెలు, ఇతర గృహోపకరణ వస్తువులను బురద నుంచి వెలికి తీసి.. స్థానికులు పట్టుకెళ్తున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది. వందలాది మంది చనిపోయి.. వేలాది మంది గల్లంతైన ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇలా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Amid severe fuel and commodity shortages caused by the destruction of roads and infrastructure, people opted to salvage the cooking gas cylinders swept downstream from flooded homes and depots. Pray for Nepal 🇳🇵.. #tiktłok #nepalgovernment #world pic.twitter.com/mL8AdUvK2g
— Thronelight Studios (@solutionfield) August 27, 2026
People downstream in Nepal are fishing Gas cylinders in flood waters.
How inhuman.
The owners may not even be alive. pic.twitter.com/92QmIYl0xu
— With Love Bihar (@WithLoveBihar) August 26, 2026
Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!
మరోవైపు నేపాల్లో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 626 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి సంఖ్య ఒక్కసారిగా 2,426కు పెరిగింది. ఇందులో 517 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
Also Read: నేపాల్లో వరదలు రాబోతున్నట్లు 5 నెలల ముందే తెలుసు.. మానవ తప్పిదమా? నిర్లక్ష్యమా?