BigTV English

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: గోధుమ పిండికోసం తొక్కిసలాట.. పాక్‌లో 11 మంది దుర్మరణం

Pakistan: ఆర్థిక సంక్షోభంతో అల్లకల్లోలం అవుతుంది పాకిస్థాన్. తినడానికి తిండిలేక.. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనాలు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తండగా.. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఆకలితో అలమటిస్తున్న జనాలకు ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో గోధుమ పిండి లోడ్‌తో కూడిన లారీని పంజాబ్ ప్రావిన్స్‌కు పంపించింది. అయితే జనాలు ఒక్కసారిగా ఆ లారీపైకి ఎగబడ్డారు. రన్నింగ్ ఉన్న లారీ ఎక్కి గోధుమ పిండి బస్తాలను తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఈక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు ముజఫర్‌గఢ్, ఒఖారా, జెహానియాన్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది. గాయపడిని వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైలరవుతున్నాయి.


Tags

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×