E-Paper
Advertisement

PM Modi in Austria Tour: భారత్, ఆస్ట్రియా స్నేహం మరింత బలపడనుంది.. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ

PM Modi in Austria Tour:  భారత్, ఆస్ట్రియా స్నేహం మరింత బలపడనుంది.. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ

PM Modi Said India-Austria friendship to get stronger: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రియాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రధాని మోదీ.. ఆ దేశ ఛాన్స్‌లర్ కార్ల్ నెహమ్మెర్‌తో భేటీ అయ్యారు.

ఆస్ట్రియాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్స్‌లర్ కార్ల్ నెహమ్మెర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. భారత్, ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రియా దేశాల మధ్య స్నేహ బంధం దృఢంగా ఉందని, భవిష్యత్తుల్లోనూ ఈ బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఛాన్స్‌లర్ కార్ల్ నెహమ్మెర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఇరు దేశాలు ప్రపంచం కోసం పనిచేస్తాయని ఎక్స్ వేదికగా ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.

ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి అధికారులు ఇచ్చిన సర్‌ప్రైజ్ అదిరిపోయింది. ఓ మ్యూజిక్ బృందం ‘వందేమాతరం’ ఆలపిస్తూ లైవ్ ప్రదర్శన చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘శక్తివంతమైన సంగీత సంస్కృతికి పేరొందిన ఆస్ట్రియాలో ఈ ప్రత్యేక అనుభవాన్ని అందించింనందుకు ధన్యవాదాలు.’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

దేశ ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1983లో ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా దేశాన్ని సందర్శించారు. కాగా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకొన 75 ఏళ్లు పూర్తయినట్లు భారత విదేశాంగ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులతో వియన్నాలో ప్రధాని భేటీ కానున్నారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×