E-Paper
Advertisement

Pakistan: పాక్‌లో ఆకాశాన్ని తాకిన నిత్యావసర ధరలు.. లీటర్ పాలు ఎంతంటే?

Pakistan: పాక్‌లో ఆకాశాన్ని తాకిన నిత్యావసర ధరలు.. లీటర్ పాలు ఎంతంటే?
Advertisement

Pakistan: పాకిస్తాన్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్‌ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు.

పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర 272కు చేరింది. డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్‌ డీజిల్‌ ధర 280కి పెరిగింది. డాలర్‌తో పాక్ రూపాయి విలువ క్షీణించడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం పేర్కొంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది.

Advertisement

పాకిస్తాన్‌లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారని పాక్ ప్రజలంటున్నారు. కొన్నాళ్లుగా పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

Related News

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

Big Stories

Advertisement
×