E-Paper
Advertisement

Pakistan: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్..! సోషల్ మీడియాపై ఆంక్షలు..

Pakistan: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్..! సోషల్ మీడియాపై ఆంక్షలు..
Advertisement

Pakistan elections: పాకిస్థాన్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపిస్తూ.. సీనియర్‌ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో సోషల్‌ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆ దేశ ఎన్నికల కమిషన్‌ వీటిని తోసి పెట్టింది. వీటిపై దర్యాప్తు చేయడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఎన్నికల కమిషన్‌ నియమించింది.

ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈసీ సికందర్‌ సుల్తాన్ రజా హాజరయ్యారు. రిగ్గింగ్ కు సంబంధించిన దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకొని మూడు రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్‌కు అందజేయనుంది. మరో వైపు ఈ ఆరోపణలను రావల్పిండి కమిషనర్‌ సయీఫ్‌ అన్వర్‌ జప్పా పూర్తిగా తోసిపుచ్చారు. తమ పాత్ర ఎన్నికల్లో కేవలం సమన్వయం వరకే పరిమితం అవుతుందని ఆయన పేర్కొన్నారు. సైనిక నాయకత్వం కొలువుదీరి ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్‌ లియాఖత్‌ అలి ఛత్తా ఆరోపించడం సంచలనం సృష్టించింది.

Advertisement

పాకిస్థాన్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నెట్‌బ్లాక్స్ అనే సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల అవకతవకలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం. ఎన్నికల్లో అవకతవకలపై ఓ సీనియర్‌ అధికారి రాజీనామా చేసిన తర్వాత ఇలా జరిగిందని ఆ సంస్థ వెల్లడించింది.

Read More: నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?

Advertisement

పాక్ లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పీటీఐ మద్దతున్న 93 మంది అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. వాస్తవానికి తమకు పూర్తి మెజార్టీ వచ్చినా.. ఫలితాలను ప్రకటించకుండా జాప్యం చేసి ఆపై తారుమారు చేశారని ఆరోపించారు. తాజాగా వీటిపై పీటీఐ ఆందోళనలు చేపట్టింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×