E-Paper
Advertisement

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 30నిమిషాల్లె బ్యాగేజ్‌ మీ చేతుల్లో!

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 30నిమిషాల్లె బ్యాగేజ్‌ మీ చేతుల్లో!

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) గుడ్‌న్యూస్‌ చెప్పింది. చివరి చెక్‌ ఇన్‌ బ్యాగేజీ చేరుకున్న ౩౦ నిమిషాలకే డెలివరీ అయ్యేలా చూడాలని బీసీఏఎస్ కొన్ని విమానయా సంస్థలకు సూచించింది. బీసీఏఎస్‌ తెలిపిన ఈ ఆదేశాలను అమలు చేయడానికి విమానయాన సంస్తలు ఫిబ్రవరి 26 వరకు సమయం కోరాయి.

ప్రస్తుతం విమాన ప్రయాణికులు బ్యాగేజీ కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీసీఏఎస్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ తిప్పలు తప్పనున్నాయి. ప్రయాణికులకు ౩౦ నిమిషాల్లో బ్యాగేజీ డెలివరీ చేయాలని ఆపరేషన్, మేనేజ్‌మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (ఓఎండీఏ) బీసీఏఎస్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆదేశాలను దేశంలోని ఎయిర్ ఇండియా, అకాస, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఏడు విమానయాన సంస్థలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావడానికి తమకు ఫిబ్రవరి 26 వరకు గడువు ఇవ్వాలని విమానయాన సంస్తలు బీసీఏఎస్‌ను కోరాయి.

Read More: అమెజాన్ అడవులు ఇక మాయం!

బీసీఏఎస్‌ గత నెల బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి ఆరు ప్రధాన విమానాశ్రయాలను పర్యవేక్షించింది. ఆ పర్యవేక్షనలో నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉన్నా.. . పనితీరు మెరుగుపడినట్లు తెలింది.

ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకుంటే.. 30 నిమిషాలలోపు చివరి బ్యాగ్ చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు పెట్టాయి. ప్రస్తుతం పర్యవేక్షించిన ఆరు ప్రధాన విమానాశ్రయాలే కాక బీసీఏఎస్‌ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరిగా అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×