E-Paper
Advertisement

Missiles hit children’s hospital: చిన్నపిల్లల ఆసుపత్రిపై బాంబుల దాడి.. 20 మంది మృతి

Missiles hit children’s hospital: చిన్నపిల్లల ఆసుపత్రిపై బాంబుల దాడి..  20 మంది మృతి
Advertisement

Russian missiles Hit a Children’s hospital in Kyiv: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. కీవ్ సహా ఆ దేశవ్యాప్తంగా పలు నగరాలపై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 20 మంది వరకు మృతిచెందారు. 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

కీవ్‌లో ఉన్న హాస్పిటల్ ఓఖ్‌మాత్‌డిత్.. ఇది దేశంలోని అతిపెద్ద చిన్నారుల ఆసుపత్రి. దీనిపైనా కూడా రష్యా దాడులు చేసింది. నాలుగు నెలల వ్యవధిలో రాజధానిపై జరిగిన దాడులలో ఇదే అతిపెద్దది. పేలుళ్ల ధాటికి స్థానికంగా ఉన్న భవనాలు దద్దరిల్లాయి. కీవ్ నగరంలో ఏడుగురు మృతిచెందారు. క్రీవిరీహ్ లో 10 మంది మృతిచెందగా, దొనెట్స్క్‌లోని పోక్రోవ్స్క్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

అత్యాధునిక కింజాల్ రాకెట్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన ఆరోపిస్తోంది. 40కి పైగా క్షిపణులతో తమ దేశంలోని ఐదు నగరాలను మాస్కో లక్ష్యంగా చేసుకున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించాడు. పిల్లల ఆసుపత్రి భవనం పాక్షికంగా ధ్వంసమైందని, శిథాలల కింద చిక్కుకుపోయినవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Also Read: డెట్రాయిట్‌లో భారీ కాల్పులు.. ఇద్దరు మృతి, 19 మందికి తీవ్ర గాయాలు!

Advertisement

ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదన్నారు. రష్యా ఏం చేస్తుందో అందరూ గమనించాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, అమెరికాలో నాటో శిఖరాగ్ర సమావేశాల సమయంలో ఈ దాడులు చేసుకోవడం గమనార్హం.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×