E-Paper
Advertisement

Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణం: షేక్ హసీనా

Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణం: షేక్ హసీనా

Sheikh Hasina hints at US role in ouster from Bangladesh: బంగ్లాదేశ్‌లో జాబ్ కోటా ఆర్డర్‌పై విద్యార్థులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనలు తీవ్ర హింసాకాండకు దారితీశాయి. ఇందుకు గానూ ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. తాజాగా, తమ ప్రభుత్వ పతనానికి అమెరికానేే కారణమని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.

అయితే అమెరికా దేశానికి సెయింట్ మార్టిన్ అనే ద్వీపాన్ని అప్పగించినందుకే ఈ సమస్య వచ్చిందన్నారు. ఆనాడు బంగాళఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకే ఆ ద్వీపాన్ని అప్పగించారని ఆరోపించారు. కానీ ఈ విషయంలో ఛాందసవాదుల వల్ల తప్పుదోవ పట్టవద్దని కోరారు. ఇదిలా ఉండగా, షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు.

‘దేశంలో అల్లర్లు పెరుగుతున్నందున ఆపేందుకే రాజీనామా చేశా. ఇప్పటికే చాలామంది అమాయక విద్యార్థులు చనిపోయారు. విద్యార్థులు మృతదేహాలపై అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. కానీ దీనికి నేను అనుమతించలేదు. నాదేశ ప్రజలను అభ్యర్థిస్తున్నా. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి..బంగాళఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చింటే ఇప్పటికీ అధికారంలో ఉండగలిగేదాన్ని.’ అని షేక్ హసీనా అన్నారు.

Also Read: బంగ్లాదేశ్ లో 7 లక్షల హిందువుల భారీ ర్యాలీ.. దాడులకు వ్యతిరేకంగా నిరసన!

‘నేను బంగ్లాదేశ్ ‌లోనే ఉంటే ఇంకా చాలామంది ప్రాణాలు పోయేవి. దేశ ప్రజల ఆస్తులు, మానవ వనరులు మరింత దెబ్బతినేవి. మీరు మీ ఓటుతో నన్ను ఎన్నుకోవడంతోనే ప్రధానిగా నియామకమయ్యాను. ఎప్పటికీ మీరే నా బలం. కానీ నా పార్టీ అవామీ లీగ్ కు చెందిన నాయకులు కొంతమంది హత్యకు గురయ్యారు.ఇళ్లను సైతం తగలబెట్టారని వార్తలు వచ్చాయి. నా గుండె రోధిస్తుంది. మళ్లీ మీరు అనుమతితో త్వరలోనే తిరిగి వస్తా. బంగ్లా ప్రజల భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నా. నా తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించారు.’ అని షేక్ హసీనా భావోద్వోగానికి గురయ్యారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×