Train Accident: థాయ్లాండ్లో బుధవారం ఉదయం ఒక భయంకరమైన రైలు ప్రమాదం సంభవించింది. బ్యాంకాక్ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరుగుతున్న హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి, సరిగ్గా అదే సమయంలో కింద నుంచి వెళ్తున్న ప్రయాణికుల రైలుపై పడింది.
ఈ ఊహించని ప్రమాదం కారణంగా రైలులోని బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా, కొన్ని చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసు తెలిపారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్, పోలీసులు అక్కడికి చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: నందిగామలో దారుణం.. సొంత బిడ్డనే అమ్మకానికి పెట్టిన తల్లి.. సీన్ కట్ చేస్తే!
ప్రస్తుతం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హై స్పీడ్ రైలు నిర్మాణ పనుల్లో భద్రతా లోపాల వల్లే ఈ క్రేన్ పడిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి!
థాయ్లాండ్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం
కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడడంతో పట్టాలు తప్పిన బోగీలు
ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి
బ్యాంకాక్కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం
ఆ ప్రాంతంలో హైస్పీడ్… pic.twitter.com/UndwJX5F4k
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2026