Trump Tariff India| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై 25 శాతం సుంకాలు అమలవుతున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా రష్యా నుంచి చమురు, సైనిక కొనుగోళ్లకు జరిమానా విధిస్తామన్నారు. భారత్తో స్నేహం ఉన్నప్పటికీ.. తమకు వాణిజ్యమే ముఖ్యమని ట్రంప్ చెప్పారు. పైగా భారత్ విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువని ఆయన ఆరోపించారు.
ట్రంప్ వాదన
ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు భారత్ విధిస్తోందని చెప్పారు. భారత్ రష్యా నుంచి ఎక్కువ సైనిక సామగ్రి కొంటుందన్నారు. రష్యా చమురు కొనుగోళ్లలో భారత్, చైనా ముందున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆపాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు.
జరిమానా కారణాలు
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగించడంపై అమెరికా చాలాకాలంగా మండిపడుతోంది. భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని రష్యా.. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తోందని ట్రంప్ చెప్పారు. “అందుకే అదనపు జరిమానా విధిస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి ఈ జరిమానా అమలవుతుంది. భారత్పై వాణిజ్య ఒత్తిడి పెరుగుతుంది. ఇది భారత్ ఎగుమతులను ప్రభావితం చేస్తుంది.” అనేది ట్రంప్ వాదన.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం
భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి. ఈ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని ట్రంప్ అన్నారు. భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో 26 శాతం సుంకం ప్రకటించారు. ఒప్పందం కోసం 90 రోజుల సమయం ఇచ్చారు. జులై 9 నాటికి ఒప్పందం కుదరలేదు.
ట్రంప్ వార్నింగ్
ట్రంప్ గతంలో 20-25 శాతం సుంకం గురించి సూచించారు. ఇప్పుడు 25 శాతం సుంకం నిర్ణయించారు. భారత్ను స్నేహ దేశంగా పిలిచారు. కానీ వాణిజ్య అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. రష్యా చమురు కొనుగోళ్లు యుద్ధాన్ని ప్రోత్సహిస్తాయని ఆరోపించారు. ఈ సుంకాలు భారత్ ఎగుమతులకు సవాలుగా మారనున్నాయి.
ఇతర దేశాలకు హెచ్చరికలు
సుంకాల గురించి అమెరికా సెనేటర్ లిండ్సీ గ్రాహమ్ కూడా హెచ్చరించారు. రష్యా చమురు కొనే దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామన్నారు. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించారు. ఈ దేశాలు 80 శాతం రష్యా చమురు కొంటాయన్నారు. ఇది పుతిన్ యుద్ధ యంత్రాన్ని నడిపిస్తుందని చెప్పారు. నాటో చీఫ్ మార్క్ రట్టే కూడా హెచ్చరించారు.
భారత్ స్పందన
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలన్నారు. గడువులతో ఒప్పందం చేయలేమన్నారు. భారత్ రష్యా చమురు కొనుగోళ్లు చట్టబద్ధమని చెప్పారు. ఈ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాముంది.
Also Read: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. అయితే రష్యా చమురు కొనుగోళ్లు మాత్రం భారత్ కొనసాగే అవకాశం ఉంది. ఇతర దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఈ సుంకాలు ధరలను పెంచవచ్చు. భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలి.