E-Paper
Advertisement

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..

Human Trafficking Case: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు.. తెలుగు వారిపై అభియోగాలు.. వెనక్కి తీసుకున్న యూఎస్ పోలీసులు..
Advertisement

Human Trafficking Case: యూఎస్ లోని న్యూజెర్సీ స్టేట్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను 2024 జులైలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫేక్ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పనులు చేయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి . అయితే తాజాగా ఆ నలుగురు తెలుగువాళ్లపై యూఎస్ పోలీసులు అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

గతేడాది మార్చి నెలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్సిటన్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లో 15 మంది మహిళలను గుర్తించారు. వారందని అక్రమంగా యూఎస్ తీసుకుని వచ్చి బలవంతంగా పనులు చేయించారని.. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ.. మనుషుల అక్రమ రవాణా కేసు కింద తెలుగు వాళ్లపై కోర్టులో కేసు నమోదు అయింది. ఈ కేసులో చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా ను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వారిపై పోలీసులు దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ కేసుపై ప్రిన్సిటన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం తమ అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అటార్నీ కార్యాలయానికి లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

అయితే .. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకున్న 15 మంది మహిళలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమను అక్రమంగా తీసుకొచ్చినట్లు గానీ, బలవంతంగా పనులు చేపించినట్లు గానీ చెప్పలేదు. దీంతో పోలీసులు తమ అభియోగాలను వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. డాలస్ న్యూస్ అనే వెబ్ సైట్ కొద్ది రోజుల క్రితం ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ నలుగురు తెలుగువాళ్లపై అరెస్టు వారంట్లు జారీ చేసినప్పుడు బహిరంగా మీడియా ముందు ప్రకటన చేసిన ప్రిన్సిటన్ పోలీసులు.. ఇప్పుడు మాత్రం ఈ కేసు వివరాలను బయటకు చెప్పుకోలేదు. దీంతో పోయిన పరువును ఆ నలుగురు తెలుగువాళ్లకు ఎవరు తిరిగి ఇస్తారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: అమెరికాలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ట్రంప్ నిర్ణయాలే కారణమా?

Advertisement

అమెరికా ప్రిన్సిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఆరోపణలను ఎత్తివేసినట్లు, అరెస్టు వారెంట్లను తిరిగి పొందారని బహిరంగంగా చెప్పలేదని వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఒకరు ఈ విషయాన్ని తెలిపినట్లు కథనంలో ప్రచురింపబడింది. అయితే నలుగురు తెలుగువాళ్లపై ఆరోపణలు అవాస్తవమని తేలిన తరువాత .. ఆ విషయం ప్రిన్స్‌టన్ పోలీసులు బహిరంగంగా చెప్పాలని వారి తరఫు న్యాయవాది కోరినట్లు తెలుస్తోంది.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×