Human Trafficking Case: యూఎస్ లోని న్యూజెర్సీ స్టేట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను 2024 జులైలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫేక్ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పనులు చేయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి . అయితే తాజాగా ఆ నలుగురు తెలుగువాళ్లపై యూఎస్ పోలీసులు అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
గతేడాది మార్చి నెలలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్సిటన్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లో 15 మంది మహిళలను గుర్తించారు. వారందని అక్రమంగా యూఎస్ తీసుకుని వచ్చి బలవంతంగా పనులు చేయించారని.. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ.. మనుషుల అక్రమ రవాణా కేసు కింద తెలుగు వాళ్లపై కోర్టులో కేసు నమోదు అయింది. ఈ కేసులో చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా ను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వారిపై పోలీసులు దాడులు కూడా నిర్వహించారు. అయితే ఈ కేసుపై ప్రిన్సిటన్ పోలీసులు కొద్ది రోజుల క్రితం తమ అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అటార్నీ కార్యాలయానికి లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అయితే .. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకున్న 15 మంది మహిళలు ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమను అక్రమంగా తీసుకొచ్చినట్లు గానీ, బలవంతంగా పనులు చేపించినట్లు గానీ చెప్పలేదు. దీంతో పోలీసులు తమ అభియోగాలను వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. డాలస్ న్యూస్ అనే వెబ్ సైట్ కొద్ది రోజుల క్రితం ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ నలుగురు తెలుగువాళ్లపై అరెస్టు వారంట్లు జారీ చేసినప్పుడు బహిరంగా మీడియా ముందు ప్రకటన చేసిన ప్రిన్సిటన్ పోలీసులు.. ఇప్పుడు మాత్రం ఈ కేసు వివరాలను బయటకు చెప్పుకోలేదు. దీంతో పోయిన పరువును ఆ నలుగురు తెలుగువాళ్లకు ఎవరు తిరిగి ఇస్తారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అమెరికాలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ట్రంప్ నిర్ణయాలే కారణమా?
అమెరికా ప్రిన్సిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆరోపణలను ఎత్తివేసినట్లు, అరెస్టు వారెంట్లను తిరిగి పొందారని బహిరంగంగా చెప్పలేదని వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు డిపార్ట్మెంట్లో ఒకరు ఈ విషయాన్ని తెలిపినట్లు కథనంలో ప్రచురింపబడింది. అయితే నలుగురు తెలుగువాళ్లపై ఆరోపణలు అవాస్తవమని తేలిన తరువాత .. ఆ విషయం ప్రిన్స్టన్ పోలీసులు బహిరంగంగా చెప్పాలని వారి తరఫు న్యాయవాది కోరినట్లు తెలుస్తోంది.