E-Paper
Advertisement

Gurugram: గురుగ్రామ్‌లో మొదటి సౌతాంప్టన్ యూనివర్సిటీ .. క్లాసులు ప్రారంభం

Gurugram:  గురుగ్రామ్‌లో మొదటి సౌతాంప్టన్ యూనివర్సిటీ ..  క్లాసులు ప్రారంభం
Advertisement

Gurugram: దేశంలో మొదటి ఫారెన్ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం గురుగ్రామ్‌లో ప్రారంభించింది. యూజీసీ నిబంధనల ప్రకారం భారతదేశంలో ఏర్పడిన తొలి విదేశీ విశ్వవిద్యాలయ ఇదే. అందులో యూపీ, పీజీ కోర్సులను అందించనుంది. ఈ క్యాంపస్‌లో మరో స్పెషల్ ఉంది, విద్యార్థులు ఓ ఏడాది యూకే, మలేషియాలో క్యాంపస్‌ల్లో చదవొచ్చు.

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఈ ఏడాది సెప్టెంబర్‌లో 140 మంది విద్యార్థులతో విద్యా సెషన్‌ను ప్రారంభిస్తుంది. జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనల మేరకు దేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి విదేశీ యూనివర్సిటీ క్యాంపస్.

Advertisement

గురుగ్రామ్‌లోని సెక్టార్ 59లో ఉన్న క్యాంపస్‌ను జూలై 16న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సియానీ దీన్ని ప్రారంభించారు. ఈ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఉంది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం QS టాప్-100ల్లో ఒకటి. ఈ క్యాంపస్‌లో 75 మందికి పైగా పూర్తి సమయం ఫ్యాకల్టీ సభ్యులను నియమించనుంది. వీరంతా యూకె విద్యా అర్హతలను కలిగి ఉన్నారు. ఫ్యాకల్టీని UK, UAE, జర్మనీ, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థల నుండి తీసుకొస్తున్నారు.

బిజినెస్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ -ఫైనాన్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లో నాలుగు అండర్ గ్రాడ్యుయేట్ (BSc) ప్రోగ్రామ్‌లు, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్‌లో రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ (MSc) ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఈ డిగ్రీలు పూర్తిగా యూకె విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇక్కడ చదివే విద్యార్థులు.. యూకె లేదా మలేషియా క్యాంపస్‌లలో ఏడాది అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: తెలంగాణలో బీటెక్ మేనేజ్ మెంట్ కోటా సీట్లు.. 19నుంచి అడ్మిషన్లు

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 290,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లతో వివిధ స్థాయిలో పని చేస్తున్నారు. పూర్వ విద్యార్థులకు నెట్‌వర్క్‌ ఉంది. అందులో 1,700 మందికి పైగా భారత్ విద్యార్థులు ఉన్నారు. ఈ పూర్వ విద్యార్థులలో చాలా మంది మెంటర్‌షిప్, పరిశ్రమ సహకారం ద్వారా కొత్త క్యాంపస్‌కు మద్దతు ఇవ్వనున్నారు.

గతేడాది ఆగస్టు 29న లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ని అందుకుంది. సెప్టెంబర్ 13న అధికారికంగా ప్రకటన చేసింది. అప్పటి నుండి మొత్తం ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయడం, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2035 నాటికి ఆ క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్యను 5,000 కి పెంచాలనే ఆలోచనలో ఉంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×