E-Paper
Advertisement

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Indian Railway:  రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Indian Railway: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 434 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 8న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 434

రైల్వే రిక్రూట్మెంట్ లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ సూపరెంటెండెంట్, ఫార్మాసిస్ట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేట్-2, డయాలిసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు:

నర్సింగ్ సూపరిండెంట్ : 272 పోస్టులు

ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) : 105 పోస్టులు

రేడియో గ్రాఫర్ (ఎక్స్- రే టెక్నీషియన్) : 4 పోస్టులు

ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ -2 : 12 పోస్టులు

డయాలిసిస్ టెక్నీషియన్: 4 పోస్టులు

హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-2 : 33 ఉద్యోగాలు

ఈసీజీ టెక్నీషియన్: 4 ఉద్యోగాలు

విద్యార్హత: డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ కెమిస్ట్రీ, డీఎంఎల్టీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి రూ.44,900 జీతం ఉంటుంది. ఫార్మాసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. రేడియోగ్రాఫర్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-2 ఉద్యోగానికి రూ.35,400 జీతం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2 రూ.21,700 జీతం ఉంటుంది. డయాలిసిస్ టెక్నీషియన్ రూ.35,400 జీతం ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్ రూ.25,500 జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్ట్ 9

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 434

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 8

ALSO READ: IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×