E-Paper
Advertisement

UPSC CIVILS Results: సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే..?

UPSC CIVILS Results: సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్.. దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన ఈ పోటీ పరీక్షలో అనూజ్ అగ్నిహోత్రి అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు. ఫలితాల జాబితాలో రాజేశ్వరి సువే రెండో ర్యాంకు కైవసం చేసుకోగా ఆకాన్ష్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాఘవ్ నాలుగో ర్యాంకు అలాగే ఇషాన్ భట్నాగర్ ఐదో ర్యాంకు సాధించి టాప్-5లో నిలిచారు.

కేంద్ర ప్రభుత్వం మొత్తం 1,087 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక విభాగాల్లో నియామకాల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్ సహా ఇంటర్వ్యూ దశలను దాటుకుని వీరు విజేతలుగా నిలిచారు. తుది జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థుల వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

విజేతల వివరాలు ఇలా ఉన్నాయి..

మొదటి ర్యాంకు: అనూజ్ అగ్నిహోత్రి

రెండో ర్యాంకు: రాజేశ్వరి

మూడో ర్యాంకు: ఆకాన్ష్

నాలుగో ర్యాంకు: రాఘవ్

ఐదో ర్యాంకు: ఇషాన్ భట్నాగర్

ప్రస్తుతం సివిల్స్ విజేతల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. అత్యున్నత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

ALSO READ: SPDCL Employees: విద్యుత్ శాఖలో ఎస్పీడీసీఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×