BigTV English
Advertisement

AP Liquor Rates: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు!

AP Liquor Rates: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు!

Liquor Rates: ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. భారీగా మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంపై మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే న్యూ ఇయర్ రానుంది. 2025 సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.


డిసెంబర్ 31వ తేదీన మద్యం కొనుగోళ్ల జోరు అధికంగా సాగడం షరా మాములే. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే నూతన మధ్య విధానం ద్వారా బ్రాండెడ్ మద్యం ను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం, ఇచ్చిన హామీ మేరకు 99 రూపాయలకే మద్యం బాటిళ్లను సైతం అందిస్తోంది.

ఏపీలో ఎన్నికలకు సమయం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మద్యం ప్రియుల కోసం నూతన మద్యం విధానంను సైతం ప్రవేశపెట్టారు. అయితే అక్కడక్కడ మద్యం షాపు యజమానులు లాభార్జన లేకపోవడంతో కొంత నిరాశను సైతం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మార్పీ రేట్లకు మించి మద్యం విక్రయాలు సాగిస్తే జరిమానాలు తప్పవంటూ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఖంగు తిన్న మద్యం షాప్ యజమానులు, తమకు హామీ ఇచ్చిన కమిషన్ ఇవ్వాలంటూ అక్కడక్కడ ఎక్సైజ్ శాఖ కమిషనర్లకు వినతి పత్రాలను సైతం అందజేశారు.


ఈ దశలోనే న్యూ ఇయర్ రానుండగా, డిసెంబర్ 31వ తేదీన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయన్న నమ్మకంతో మద్యం వ్యాపారులు సైతం ఉన్నారు. అటువంటి తరుణంలో పలు బ్రాండెడ్ మద్యం రేట్లను తగ్గిస్తూ ప్రకటన వెలువడడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ధరలు తగ్గింపుకు మార్గం సుగమమైంది.

Also Read: Game Changer: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. ఇండియాలోనే అతిపెద్ద కటౌట్ లాంఛ్..

దీనితో ఒక్క క్వార్టర్ పై 30 రూపాయలు, ఫుల్ బాటిల్ పై రూ. 90 నుండి రూ. 120 వరకు ధరలు తగ్గనున్నాయి. మ్యాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటీక్విటీ సహా పలు బ్రాండ్లు మద్యం ధరలు తగ్గించిన జాబితాలో ఉండడం విశేషం. అసలే సంక్రాంతి, న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో మద్యం ధరలు తగ్గడంపై మద్యం ప్రియులకు ఈ వార్త మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×