BigTV English

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Eluru News: టపాసులతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి కింద పడగా, టపాసులు పేలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైన ఘటన దీపావళి పండుగ రోజే జరిగింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో గురువారం జరగగా, ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఏలూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మరొకరితో కలిసి, హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబుల బస్తాను తీసుకువెళ్తున్నారు. అయితే ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్దకు రాగానే రహదారిపై గల గుంతలను గమనించి, బైక్ స్పీడును నియంత్రించే క్రమంలోనే అదుపు తప్పింది. దీనితో బైక్ పై తీసుకెళ్తున్న ఉల్లిపాయ బాంబుల బస్తా బలంగా నేలపై పడడంతో, ఒక్కసారిగా టపాసులు పేలాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం లో దట్టమైన పొగ, భీకర శబ్దాలు దద్దరిల్లాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే, బైక్ పై గల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు, పోలీసులు వారిని ఏలూరు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది.

Also Read: MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై మదీనా భాష ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బైక్ పై దీపావళి సందర్భంగా టపాసులను తీసుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో, మృతి చెందిన సుధాకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీపావళి పండుగ రోజే ఏలూరులో విషాదకర ఘటన జరగగా, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.


కాగా టపాసులు కింద పడిన సమయంలో, సుధాకర్ తేరుకొనేలోగానే ఒక్కసారిగా టపాసులు పేలడంతో సుధాకర్ శరీరంపై తీవ్ర గాయాలు కావడం, అక్కడిక్కడే మృతి చెందడం భాదాకరమని స్థానికులు అన్నారు. అలాగే డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పండుగ రోజు ఇటువంటి ఘటన జరగడం కలచి వేసిందన్నారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలని సూచించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 112, 101, 1070 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×