E-Paper
Advertisement

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి
Advertisement

Eluru News: టపాసులతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి కింద పడగా, టపాసులు పేలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైన ఘటన దీపావళి పండుగ రోజే జరిగింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో గురువారం జరగగా, ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏలూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మరొకరితో కలిసి, హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబుల బస్తాను తీసుకువెళ్తున్నారు. అయితే ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్దకు రాగానే రహదారిపై గల గుంతలను గమనించి, బైక్ స్పీడును నియంత్రించే క్రమంలోనే అదుపు తప్పింది. దీనితో బైక్ పై తీసుకెళ్తున్న ఉల్లిపాయ బాంబుల బస్తా బలంగా నేలపై పడడంతో, ఒక్కసారిగా టపాసులు పేలాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం లో దట్టమైన పొగ, భీకర శబ్దాలు దద్దరిల్లాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే, బైక్ పై గల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు, పోలీసులు వారిని ఏలూరు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది.

Advertisement

Also Read: MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై మదీనా భాష ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బైక్ పై దీపావళి సందర్భంగా టపాసులను తీసుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో, మృతి చెందిన సుధాకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీపావళి పండుగ రోజే ఏలూరులో విషాదకర ఘటన జరగగా, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.

కాగా టపాసులు కింద పడిన సమయంలో, సుధాకర్ తేరుకొనేలోగానే ఒక్కసారిగా టపాసులు పేలడంతో సుధాకర్ శరీరంపై తీవ్ర గాయాలు కావడం, అక్కడిక్కడే మృతి చెందడం భాదాకరమని స్థానికులు అన్నారు. అలాగే డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పండుగ రోజు ఇటువంటి ఘటన జరగడం కలచి వేసిందన్నారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలని సూచించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 112, 101, 1070 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Advertisement

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×