BigTV English
Advertisement

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Eluru News: టపాసులతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి కింద పడగా, టపాసులు పేలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైన ఘటన దీపావళి పండుగ రోజే జరిగింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో గురువారం జరగగా, ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఏలూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మరొకరితో కలిసి, హోండా యాక్టివా వాహనంపై ఉల్లిపాయ బాంబుల బస్తాను తీసుకువెళ్తున్నారు. అయితే ఏలూరులోని తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్దకు రాగానే రహదారిపై గల గుంతలను గమనించి, బైక్ స్పీడును నియంత్రించే క్రమంలోనే అదుపు తప్పింది. దీనితో బైక్ పై తీసుకెళ్తున్న ఉల్లిపాయ బాంబుల బస్తా బలంగా నేలపై పడడంతో, ఒక్కసారిగా టపాసులు పేలాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం లో దట్టమైన పొగ, భీకర శబ్దాలు దద్దరిల్లాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే, బైక్ పై గల సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు, పోలీసులు వారిని ఏలూరు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది.

Also Read: MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై మదీనా భాష ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బైక్ పై దీపావళి సందర్భంగా టపాసులను తీసుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో, మృతి చెందిన సుధాకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీపావళి పండుగ రోజే ఏలూరులో విషాదకర ఘటన జరగగా, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.


కాగా టపాసులు కింద పడిన సమయంలో, సుధాకర్ తేరుకొనేలోగానే ఒక్కసారిగా టపాసులు పేలడంతో సుధాకర్ శరీరంపై తీవ్ర గాయాలు కావడం, అక్కడిక్కడే మృతి చెందడం భాదాకరమని స్థానికులు అన్నారు. అలాగే డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పండుగ రోజు ఇటువంటి ఘటన జరగడం కలచి వేసిందన్నారు. టపాసులు కాల్చే సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు తప్పనిసరిగా పెద్దల సమక్షంలో టపాసులు కాల్చాలని సూచించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 112, 101, 1070 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×