BigTV English
Advertisement

AP women in Kuwait: చిత్రహింసలు పెడుతున్నారు.. చంపేస్తున్నారు.. మహిళ ఆవేదన.. అసలు స్టోరీ తెలిస్తే కన్నీళ్లే!

AP women in Kuwait: చిత్రహింసలు పెడుతున్నారు.. చంపేస్తున్నారు.. మహిళ ఆవేదన.. అసలు స్టోరీ తెలిస్తే కన్నీళ్లే!

AP women in Kuwait: భర్త చనిపోయాడు. తన పిల్లల పొట్టకూటి కోసం ఓ తల్లి ధైర్యం చేసి, కువైట్ కి వెళ్లింది. ఇక అంతా సవ్యంగా ఉంది. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డ ఆమె కలలు.. అడియాశలయ్యాయి. ప్రస్తుతం ఎలాగైనా తన పిల్లలను దగ్గరుండి చూసుకోవాలని ఆరాటపడుతోంది. అక్కడి చిత్రహింసలను తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతూ, ఓ వీడియో విడుదల చేసింది ఆ తల్లి.


కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లంమిల్లి గ్రామానికి చెందిన కుమారి అనే మహిళకు వివాహమై ఇరువురు సంతానం. అయితే భర్త మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన కుమారి కూలీ నాలీ పనులు చేసుకుంటూ తన బిడ్డలను పోషించేది. చాలీచాలని కూలి డబ్బులతో పిల్లల పోషణ భారమై తమ కుటుంబ సభ్యులు సూచన మేరకు బ్రతుకుతెరువు కోసం కువైట్ కి వెళ్ళింది.

కువైట్ కి వెళ్లేందుకు కూడా అప్పులు చేసిన ఆ మహిళ, ఇక తన పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదని ఆనందపడింది. అయితే పట్టుమని 7 నెలల వ్యవధిలోనే అక్కడ పడుతున్న చిత్రహింసలకు మనోవేదన చెందుతూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. కానీ రోజురోజుకు కువైట్ దేశంలో పడుతున్న చిత్రహింసలు అధికం కాగా కన్నీటి పర్యంతమవుతూ.. ఓ వీడియోను కుమారి విడుదల చేసింది.


Also Read: YS Sharmila: అవినాష్ రెడ్డిని మరచిపోయారా? సజ్జల సంగతేంటి? ఏ ప్యాలెస్ లో ఉన్నా వదలొద్దు.. వైఎస్ షర్మిళ

ఆ వీడియో ఆధారంగా.. తాను బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వచ్చానని, ఇక్కడ చిత్రహింసలు పెడుతూ తనను చంపేసేలా ఉన్నట్లు, పిల్లల భవిష్యత్తు కోసం వస్తే.. చివరికి తానే మిగిలేలా లేనట్లు కన్నీటి పర్యంతమైంది. తాను తీస్తున్న వీడియోను కూడా రహస్యంగా తీస్తున్నట్లు, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా.. తన పిల్లలకు దూరం చేసే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి తనను ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించి తన పిల్లల దగ్గరికి చేర్చాలంటూ వేడుకుంటుంది కుమారి. తల్లి అక్కడ.. బిడ్డలేమో ఇక్కడ ఆకలి దప్పులతో కాలం వెళ్లదీస్తున్నారట. మొత్తం మీద ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×