E-Paper
Advertisement

Satellite Crop Survey: రాష్ట్రంలో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి.. ఈసారి విస్తీర్ణం 8 నుంచి 12% తక్కువ నమోదు

Satellite Crop Survey: రాష్ట్రంలో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి.. ఈసారి విస్తీర్ణం 8 నుంచి 12% తక్కువ నమోదు
Advertisement

Satellite Crop Survey: స్వేఛ్చబ్యూరో: రాష్ట్రంలో సుమారు పదివేల రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కింపు పూర్తి అయిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అద్దాస్ జానయ్య(Professor Addas Janayya) తెలిపారు. సైఫాబాద్ లోని కమ్యూనిటీ కళాశాలలో శనివారం మీడియాతో మాట్లాడారు. శాటిలైట్ ఆధారిత పంటల విస్తీర్ణం లెక్కింపు పై ప్రభుత్వానికి ఫిబ్రవరి 6న నివేదిక అందజేయను ఉన్నామని వెల్లడించారు. మొత్తం సాగు విస్తీర్ణంలో 8 నుంచి 12% తక్కువ నమోదు అవుతున్న పంట విస్తీర్ణం అవుతుందన్నారు.

ఎస్ఏఆర్ఎంఎపితో ఒప్పందం

జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత ఏడాది అధునాతన డిజిటల్ వ్యవసాయ మరియు సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి అందులో భాగంగా అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలతో పాటు రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ ప్రయోగశాల కూడా అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారన్నారు. గత కొన్ని మాసాలుగా శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారిగా పంటల విస్తీర్ణాన్ని కచ్చితంగా లెక్కించే ఒక వినూత్న పథకాన్ని స్విట్జర్ ల్యాండ్ లోని ప్రపంచ ప్రఖ్యాత శాటిలైట్ చిత్రాల విశ్లేష సంస్థ అయినా ఎస్ఏఆర్ఎంఎపితో ఒప్పందం చేసుకొని ప్రారంభించారు. ఈ వినూత్న సాంకేతిక ప్రొజెక్ట్ ఫలితాలని వ్యవసాయ గ్రామస్థాయి సిబ్బంది పరిశీలించినప్పుడు సుమారు 90% వరకు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని మొత్తం రెవిన్యూ గ్రామాలలో సుమారు 870 గ్రామాల మ్యాపులు లభ్యం కానందున వాటిని మినహాయించి మిగతా అన్ని రెవిన్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తి చేసింది.

Advertisement

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ

ప్రతి రైతుకు భీమా పరిహారం

ప్రాథమిక ఫలితాల ప్రకారం సరాసరిగా మొత్తం సాగు యోగ్యమైన విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవంగా పంటలు వేసిన విస్తీర్ణం 8-12% వరకు తక్కువగా ఉన్నట్లు తేలింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ పంటల విస్తీర్ణం లెక్కింపునకు సంబంధించిన పూర్తి నివేదికను ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కి అందజేయున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కింపుతో పంటల భీమా అమలులో నష్టపోయిన ప్రతి రైతుకు భీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకతతో పాటు సకాలంలో అమలు చేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హత కల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Advertisement

Also Read: Mega158 Chiranjeevi: ‘మెగాస్టార్ 158’లో చిరుకు జోడీ కన్ఫామ్ చేసిన దర్శకుడు.. ఎవరంటే?

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×