Glowing Skin:ఈ రోజుల్లో, చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. అయితే వాటిలో ఉపయోగించే హానికరమైన రసాయనాలు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని మీకు తెలుసా? గ్లోయింగ్ స్కిన్ కావాలనుకోవడం సరైనదే, కానీ ఇందుకోసం సహజసిద్ధమైన పద్ధతులను అవలంబించడం మంచిది. అవును, సహజమైన విషయాలు మీ చర్మం యొక్క ఛాయను మెరుగుపరచడమే కాకుండా ఎటువంటి దుష్ప్రభావాలను కూడా కలిగించవు. ఖరీదైన ఫేషియల్ లేదా బ్లీచ్ని వాడకుంటా గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని రకాల పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
మీరు కూడా మీ చర్మం మెరుస్తూ, మచ్చ లేకుండా ఉండాలని కోరుకుంటున్నారా ? అయితే మార్కెట్లో లభించే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కాకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. మరి ఇందుకు ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, నిమ్మరసం:
మీ చర్మం మెరిసిపోవడానికి మీకు ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని సహజంగా కాంతివంతం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక గిన్నెలో తేనె, పాలు, నిమ్మరసం మిక్స్ చేసి ఈ ప్యాక్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. కొన్ని రోజుల్లో మీ చర్మంలో మార్పును మీరు తప్పకుండా గుర్తిస్తారు. తేనె మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. పాలు కూడా స్కిన్ను మృదువుగా చేస్తాయి. నిమ్మకాయ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది.
బియ్యం పిండి:
చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి బియ్యం పిండి సహజమైన, సమర్థవంతమైన నివారణ. ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది . అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బియ్యం పిండి ప్యాక్ చేయడానికి, ముడి బియ్యాన్ని మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా ఆముదం, పచ్చి పాలు కలపండి. ఈ మిశ్రమం మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనితో, మీ చర్మం కొన్ని రోజుల్లో మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీ చర్మం సహజంగా మెరుస్తుంది.
పసుపు , పెరుగు:
పసుపులో ఉండే కుర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది అనేక రకాల సమస్యల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మచ్చలు, మొటిమలు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, పెరుగు చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు , 1/4 టీస్పూన్ పసుపును తీసుకుని, రెండింటినీ కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ని వారానికి 2-3 సార్లు వేసుకుంటే చర్మం మెరుస్తుంది.
Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం
టమాటో , ముల్తానీ మిట్టి:
టమాటో , ముల్తానీ మిట్టితో చేసిన ప్యాక్ కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మచ్చలు లేకుండా చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం, టమాటోను మెత్తగా పేస్ట్ లాగా చేయండి. అందులో ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ని వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం ఎలాంటి ఫేషియల్ లేదా బ్లీచ్ లేకుండానే మెరుస్తుంది.