E-Paper
Advertisement

Rayalaseema special: రాయలసీమ స్పెషల్.. రాగి సంగటి నాటుకోడి పులుసు ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!

Rayalaseema special: రాయలసీమ స్పెషల్.. రాగి సంగటి నాటుకోడి పులుసు ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!
Advertisement

Rayalaseema special: రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఫేమస్ రాగి సంగటి, నాటు కోడి పులుసు.. ఏదైన చిన్న అకేషన్ అయిన, లేదంటే ఇంటికి బంధువులు వచ్చిన నాటుకోడి రాగి సంగటి చేయాల్సిందే. మరి రాయలసీమ స్పేషల్ అయినటువంటి నాటుకోడి రాగి సంగటి ఎలా చేయాలో తెలుసా?

నాటుకోడి పులుసు తయారీ విధానం:

Advertisement

కావలసిన పదార్థాలు: చికెన్-అరకిలో
. ఎండుమిరపకాయలు-4
. యాలకులు-4
. దాల్చిన చెక్క-1
. ధనియాలు-(2 టేబుల్ స్పూన్లు)
. మిరియాలు -4
. లవంగాలు-6
. అనాస పువ్వు-2
. వెల్లుల్లి-8
. గసగసాలు-టేబుల్ స్పూన్
. వట్టి కొబ్బరి-1
. నూనె-3 టేబుల్ స్పూన్లు
. పచ్చి మిర్చి-4
. టమోటాలు-2
. కారం- తగినంత
. ఉప్పు-తగినంత
. అల్లం వెల్లుల్లి పెస్ట్- 2టేబుల్ స్పూన్లు
. పసుపు-చిటెకెడు
. ఉల్లిపాయ-2
. కరివేపాకు- నాలుగు రెబ్బలు
. కొత్తిమిరా- తగినంత

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడా నూనె పోసుకుని అది కొంచెం మరిగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని అవి కాస్తా వేగాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ రెండు కాస్తా వేగాకా కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకోవాలి. దీని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఫేస్ట్ వేసుకోవాలి. ఈ మసలా అంత వేగాకా ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి దీంతో పాటుగా ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు బాగా వేగనివ్వాలి. అయితే ఎండుమిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, వెల్లుల్లి, గసగసాలు, వట్టి కొబ్బరి వీటిని మొత్తం కలిపి మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాల పొడిని ఉడుకుతున్న చికెన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. దీని తర్వాత చికెన్‌కు సరిపడా కారం వేసుకుని, అలాగే ఉడకడానికి సరిపడా నీళ్లు మూసి మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుని కాస్తా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని వీటిని కలిపి దించేసుకుంటే అంతే.. గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ.

Advertisement

Also Read: ఆరోగ్యానికి 12 సూత్రాలు.. అవేంటో తెలుసా?

రాగి సంగటి తయారీ విధానం:

కావల్సిన పదార్థాలు:
బియ్యం- రెండు కప్పులు
రాగిపిండి- ఒక కప్పు
నీరు- తగినంత

తయారీ విధానం:
ముందుగా బియ్యంను శుభ్రం చేసుకుని ఐదు నిమిషాల నానబెట్టుకోవాలి.. తర్వాత ఆ బియ్యానికి సరిపడా నీళ్లు పోసి చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన అన్నంలోకి తగినంత రాగి పిండి వేసి సిమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. దీని తర్వాత రాగి ముద్దలు కట్టుకుంటే అంతే ఇంకా రాయలసీమ స్పేషల్ రాగి సంగటి రెడీ అయినట్టే.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×