E-Paper
Advertisement

Marriage and Divorce: పెళ్లయిన పదేళ్ల తర్వాత జంటల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది?

Marriage and Divorce: పెళ్లయిన పదేళ్ల తర్వాత జంటల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది?
Advertisement

పెళ్లయిన తర్వాత పదేళ్లపాటు అందరూ ఆనందంగానే జీవిస్తున్నారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. తమ వైవాహిక బంధానికి స్వస్థి చెబుతున్నారు. అన్నేళ్ల పాటూ కలిసి జీవించి విడాకులు తీసుకోవడమే విచిత్రంగా అనిపిస్తోంది. పెళ్లైన పదేళ్ల తర్వాత జంటల మధ్య దూరం పెరగడం మొదలవుతున్నట్టు తెలుస్తోంది.

పెళ్లయిన పదేళ్ల తర్వాత దూరం ఎందుకు?
ఏ జంటలు అయితే తమకున్న అపార్ధాలను అనుమానాలను బహిరంగంగా మాట్లాడుకోరో వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. భావద్వేగాల అనుబంధం లేకపోవడం వల్ల కూడా సంబంధం బలహీనపడడం ప్రారంభమవుతుంది. భాగస్వాములు పదేళ్లలోనే ఒకరికి ఒకరు భావోద్వేగపరంగా దగ్గర అవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ అనుబంధం పదేళ్ల తర్వాత కూడా దృఢంగా మారుతుంది.

Advertisement

సుదీర్ఘ వివాహంలో జంటలకు కుటుంబం, బంధువులు, పిల్లలు, వారి చదువులు వంటి బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి అయిన పదేళ్ల తర్వాతే ఈ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జంటలు ఒకరితో ఒకరు సమయం గడపలేక వారి మధ్య దూరం పెరిగిపోతుంది. అలాగే వారి జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.

త్వరగా విసుగు చెందడం, జీవితం బోరింగ్ గా అనిపించడం వంటివి పెళ్లైన పదేళ్ల తర్వాతే ప్రారంభమవుతాయి. భార్యాభర్తల అనుబంధంలో కొత్తదనం తగ్గినప్పుడు దూరం చేరిపోతుంది. చాలా కాలం పాటు కలిసి ఉన్న జంటలు కూడా ఒకరినొకరు తేలిగ్గా తీసుకొని ఇతరుల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు.

Advertisement

దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి
భార్యాభర్తలు తమ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోవాలి. వారి ఆలోచనలు, భావాలు సమస్యలను బహిరంగ పంచుకోవాలి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. సంబంధంలో కొత్తదనాన్ని పెంచుకోవడం కోసం డేటింగ్ వంటివి ప్లాన్ చేయాలి. ఇద్దరూ కలిసి ప్రయాణించాలి. సడన్ సర్ ప్రైజ్‌లు ఇచ్చుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని చెప్పుకోవాలి. నమ్మకం ఏ బంధాన్ని విచ్ఛిన్నం కానివ్వదు.

Also Read: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?

భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవాలి. ఒకరికి ఒకరు అన్నట్టు జీవించాలి. ఎప్పుడైతే వారిద్దరి మధ్య దూరం పెరిగిపోతుందో వారు ఇక కలిసి జీవించడం కష్టంగా మారిపోతుంది. కాబట్టి పెళ్లయి పదేళ్లు దాటినా కూడా వారి బంధాన్ని తాజాగా ఉంచుకునేందుకు భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాలి. పిల్లలకు తల్లిదండ్రులు కలిసి ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే వారి భవిష్యత్తు, కలలు కల్లలుగా మారిపోతాయి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×