E-Paper
Advertisement

OTT Window: ఓటీటీ వల్ల ఖాళీ అవుతున్న థియేటర్స్!.. పరిశ్రమ ముందున్న సవాళ్లు ఇవే?

OTT Window: ఓటీటీ వల్ల ఖాళీ అవుతున్న థియేటర్స్!.. పరిశ్రమ ముందున్న సవాళ్లు ఇవే?
Advertisement

OTT Window: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక సంధిగ్ధంలో ఉంది. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు వందల కోట్లు వసూలు చేస్తుంటే, మరోవైపు మధ్యతరహా, చిన్న సినిమాలు థియేటర్ల వద్ద ప్రేక్షకులను రప్పించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో థియేట్రికల్ విడుదలకు ఓటీటీ (OTT) స్ట్రీమింగ్‌కు మధ్య కనీసం మూడు నెలల సమయం (90 రోజులు) ఉండాలనే వాదన ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. గతంలో ఒక సినిమా విడుదలైన కనీసం 100 రోజుల తర్వాతే టీవీల్లో వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా విడుదలైన 3 లేదా 4 వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ప్రత్యక్షమవుతోంది. దీనికి తోడు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు, పాప్‌కార్న్, పార్కింగ్ ఖర్చులు సామాన్య కుటుంబానికి భారంగా మారాయి. “ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది కదా, అప్పుడే ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా చూడొచ్చు” అనే భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. దీనివల్ల థియేటర్ల యజమానులు భారీగా నష్టపోతున్నారు. కనీసం మూడు నెలల విండో ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటం ఖాయం.

Read also-Podarillu Today Episode : చక్రికీ పై మహా సీరియస్.. మాధవ్ కు నిజం చెప్పిన చక్రీ.. హాస్టల్ కు మహా వెళ్తుందా..?

శర్వానంద్ vs నవీన్ పోలిశెట్టి ‘

Advertisement

ఇటీవలి బాక్సాఫీస్ పోకడలను గమనిస్తే, శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ (NNNM), నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ (AOR) చిత్రాల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వరుసగా కొన్ని డిజాస్టర్లు ఎదుర్కొన్న శర్వానంద్‌కు ‘నారీ నారీ నడుమ మురారి’ ఒక ఉపశమనం అని చెప్పాలి. కంటెంట్ పరంగా ఇది ‘అనగనగా ఒక రాజు’ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సినిమా ఆలస్యంగా విడుదల కావడం, శర్వానంద్ గత చిత్రాల ప్రభావం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అడ్డంకిగా మారడం. నవీన్ పోలిశెట్టికి ఉన్న క్రేజ్ వల్ల ‘అనగనగా ఒక రాజు’ కి ప్రారంభంలో మంచి హైప్ వచ్చింది. కానీ, కంటెంట్ విషయంలో శర్వానంద్ సినిమానే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అయినప్పటికీ, ఇది “ఓకే” అనిపించుకునే స్థాయికే పరిమితమైంది.

Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?

Advertisement

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, వేల కుటుంబాలకు జీవనాధారం. థియేటర్ల మనుగడ సాగాలంటే నిర్మాతలు స్వచ్ఛందంగా ఓటీటీ గ్యాప్‌ను పెంచాలి. కేవలం హిట్ టాక్ వచ్చిన సినిమాలే కాకుండా, యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా థియేటర్లలో నిలబడాలంటే ఈ ‘మూడు నెలల నిబంధన’ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. శర్వానంద్ వంటి ప్రతిభావంతులైన నటులు సరైన సమయంలో, సరైన విండోతో ప్రేక్షకులను పలకరిస్తే బాక్సాఫీస్ వద్ద పాత రోజులు మళ్ళీ రావడం అసాధ్యమేమీ కాదు. దీని గురించి సినిమా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×