E-Paper
Advertisement

Aadarsha Kutumbam: ‘ ఆదర్శ కుటుంబం’గా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్.. పోస్టర్ వైరల్!

Aadarsha Kutumbam: ‘ ఆదర్శ కుటుంబం’గా వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్.. పోస్టర్ వైరల్!
Advertisement

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇప్పటివరకు 76 సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను సందడి చేశారు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) దర్శకత్వంలో తన 77వ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించిన బోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయంపై ఎన్నో రకాల సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలన్నింటికీ పెడుతూ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47” (Aadarsha Kutumbam house No 47)అనే టైటిల్ ప్రకటిస్తూ ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాని 2026 సమ్మర్లో విడుదల చేసే విధంగా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే కనుక ఇది ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుందని స్పష్టమవతుంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా AK 47..

Advertisement

ఇక ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపిక అయ్యారు. అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని అయితే ఈమె పూర్తిగా నెగిటివ్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారంటూ కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి. మరి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Advertisement

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త సినిమాకు కమిట్ అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. త్రివిక్రమ్ కథా రచయితగా మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలలో వెంకటేష్ నటించిన కానీ దర్శకుడిగా ఇది మొదటి సినిమా కావటం విశేషం. అయితే నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి సినిమాలు కూడా ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా ఉండటం అసలు ఇష్టం లేదు.. సీజన్ 10 కి నాగార్జున ఉండరా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×