Ramayana Movie: నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒక డిజిటల్ క్రియేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి, 1993 నాటి క్లాసిక్ యానిమేషన్ చిత్రం ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ను ప్రస్తుత నటులతో లైవ్-యాక్షన్ రూపంలో రీక్రియేట్ చేశారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read also-Mega 158: మెగా 158 షూటింగ్ అప్డేట్.. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్..
ఈ AI చిత్రాల్లో ముఖ్యంగా రణబీర్ కపూర్ శివధనుస్సును విరిచే సన్నివేశం, యష్ సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లే దృశ్యాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ ఆహార్యం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. “రాముడి కంటే రావణుడే శక్తివంతంగా ఉన్నాడని” కొందరు, “నటీనటులు అందరూ వారి పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారని” మరికొందరు కామెంట్లతో ఈ చిత్రాలను ప్రశంసిస్తున్నారు.
Read also-Ram Charan: వారికి రామ్ చరణ్ టీం సీరియస్ వార్నింగ్.. ఆ వీడియోలు వస్తే మాత్రం..
దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం. ఈ AI చిత్రాలు రాబోయే సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న కుతూహలాన్ని మరింత పెంచాయి.