E-Paper
Advertisement

Anaganaga Oka Raju : కామెడీ ఒక్కటే కాదు… పొలిటికల్ టచ్ కూడా… అసలు స్టోరీ రివీల్ చేసిన నాగ వంశీ

Anaganaga Oka Raju : కామెడీ ఒక్కటే కాదు… పొలిటికల్ టచ్ కూడా… అసలు స్టోరీ రివీల్ చేసిన నాగ వంశీ
Advertisement

Anaganaga Oka Raju: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం మరోసారి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగ వంశీ పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో జరిగింది కానీ నిర్మాత నాగ వంశ హాజరు కాలేకపోయిన. తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని సినిమా గురించి మాట్లాడుతూ అసలు స్టోరీ బయట పెట్టారు.

సోగ్గాడే చిన్నినాయన తరహాలో..

ఈ సందర్భంగా నాగ వంశీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ సినిమా కామెడీ జోనర్ లోనే ఉంటుందని అందరూ భావించారు కానీ కామెడీతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని ఈయన తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదా సరదాగా సోగ్గాడే చిన్నినాయన సినిమా తరహాలో ఉండబోతుందని తెలిపారు. ఇక సెకండ్ హాఫ్ పొలిటికల్ సెటైర్ గా ఉండబోతుందని తెలిపారు. పొలిటికల్ సెటైర్ అంటే ఎవరిని కించపరిచే విధంగా సినిమా ఉండదు కానీ ఫన్ గానే పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని ఈ విషయాన్ని మేము ట్రైలర్ లో దాచాము కానీ రేపు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రివిల్ చేస్తున్నాము అంటూ నాగ వంశీ తెలియజేశారు.

పొలిటికల్ టచ్.

Advertisement

ఈ సినిమాలో హీరోకి డబ్బు అవసరం అవుతుంది అలా డబ్బు అవసరమైనప్పుడు పొలిటికల్ పరంగా వెళ్లి డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనలో పాలిటిక్స్ వైపు హీరో అడుగులు వేస్తారని ఈ సందర్భంగా నాగ వంశీ తెలియజేశారు. ఇలా కామెడీ మాత్రమే కాకుండా పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నాగవంశీకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. గత కొద్దిరోజులుగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

Advertisement

ఇక ఇప్పటివరకు అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)కి జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సింగర్ సమీరా భరద్వాజ్, సత్య శ్రీ, చమ్మక్ చంద్ర, మహేష్, బుల్లి రాజు వంటి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందనే విషయాన్ని తెలియ చేయడంతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Nari Nari Naduma Murari: శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి 5:49 విడుదల వెనుక ఇదే కారణమా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×