Fuel Saving: దేశ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఇంధన పొదుపు’ పిలుపునకు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతుగా నిలిచారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించాలని భావించిన ఆయన, తన జైపూర్-ఢిల్లీ ప్రయాణానికి వ్యక్తిగత వాహనాన్ని కాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎంచుకున్నారు.
Read also-సుడిగాలి సుధీర్ బర్త్డే గిఫ్ట్.. ‘జోకర్’ టీజర్ అవుట్.. ‘కింగ్’ రేంజ్లో రచ్చ లేపిన మాస్ లుక్!
ఇరాన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి, దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా ప్రజలను కోరారు. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా కార్పూలింగ్ ఉపయోగించాలని, అలాగే విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లను ఒక ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.
Read also-‘కెనడియన్ బావి’ వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్గా మార్చేశాడు!
రైలు ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఖేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని చెప్పిన మాటలు 100% నిజం. మన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది.’ ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కార్లలో వెళ్లే బదులు ఒకే కార్లో ప్రయాణించడం అలవాటు చేసుకోవాలని, తక్కువ దూరాలకు కార్లను వాడటం తగ్గించాలని కోరారు. వందే భారత్లో ప్రయాణించడం పెద్ద త్యాగమేమీ కాదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ‘జానే పెహచానే అంజానే’ అనే థియేటర్ నాటకం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల జరిగిన యూకే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్లేమ్ అవార్డ్స్ 2026 లో ‘క్యాలరీ’ చిత్రానికి గానూ ఆయనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది.