D55 Movie: ధనుష్ హీరోగా, ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #D55 ప్రాజెక్ట్కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ధనుస్ హీరోగా తెరకెక్కుతున్న ‘D55’ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ శ్రీలీలను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ ను శ్రీ లీలను రివీల్ చేయగా మరో హీరోయిన్ ఎవరనేదాని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ధనుష్ సరసన శ్రీ లీల నటిస్తుండటం ఇదే మొదటిసారి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Read also-Jailer 2: రజినీకాంత్ సినిమాలో షారుక్ ఖాన్ షాకింగ్ పాత్ర… ఎలా కనిపించనున్నారంటే..!
ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. రాజ్కుమార్ పెరియసామి తన మునుపటి చిత్రం ‘అమరన్’లో సాయి పల్లవికి అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అందుకే ఈ ప్రాజెక్ట్లో కూడా ఆమె ఉంటుందని అందరూ ఆశించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని, అందులో ఒకరు శ్రీలీల కాగా, మరొకరు సాయి పల్లవి అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రీలీల పేరును అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది సాయి పల్లవి ప్లేస్లో శ్రీలీల వచ్చిందని భావించారు. కానీ, చిత్ర యూనిట్ నుండి సాయి పల్లవి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వలో ధనుష్ స్వంత బ్యానర్ ‘వండర్బార్ ఫిల్మ్స్’, ‘ఆర్ టేక్ స్టూడియోస్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ సెన్సేషన్ ‘కుర్చి మడతపెట్టి’ ఫేమ్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇది ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి శ్రీలీల కన్ఫర్మ్ అయ్యారు. సాయి పల్లవి ఉంటే గనుక ‘మారి 2’ తర్వాత ధనుష్-సాయి పల్లవి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.