Varanasi: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ చాలామందికి ఇప్పటికీ ఉంది. అయితే వారణాసి అనే సినిమా వరల్డ్ పరిచయం చేయడానికి దాదాపు మూడు నిమిషాల పాటు సాగే ఒక ట్రైలర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి ఫీజులు ఎగిరిపోయాయి.
ఒకవైపు మైథాలజీ పాయింట్ తో పాటు టైం ట్రావెలింగ్ కూడా సినిమాలో ఉండబోతుందని ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇక ఈ సినిమాను 2027 వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తారీఖున శ్రీరామనవమి ఉంది కాబట్టి అదే డేటును టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సమ్మర్ లో విడుదల చేస్తాము అని ఎమ్ ఎమ్ కీరవాణి మాత్రమే చెప్పారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు దేవకట్ట కూడా రచన సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.
బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యానికి కాలకేయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఏది మరణం అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చాలామంది సైన్యాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఆ డైలాగ్స్ రాసింది దేవకట్ట. అయితే అప్పటినుంచి కూడా రాజమౌళితో దేవగట్టకు మంచి పరిచయం ఉంది.
ఇప్పుడు వారణాసి సినిమాలో కూడా ఒక భాగం కాబట్టి ఏ వేదికలో దేవకట్ట హాజరైన కూడా వారణాసి సినిమా గురించి అప్డేట్ అడగడం అనేది కామన్ గా జరుగుతుంది. కార్తీ నటించిన అన్నగారి వస్తారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు దేవకట్ట హాజరయ్యారు. అక్కడ వారణాసి అప్డేట్ గురించి చెప్పమనే ప్రశ్న ఎదురైంది.
వారణాసి అప్డేట్ నేను చెప్పడం కంటే రాజమౌళి గారు బాగా చెబుతారు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి రాజమౌళి గారు ఎప్పుడు షాకులు ఇస్తూనే ఉంటారు. అలా ఇచ్చిన షాక్ లు ప్రతిసారి కూడా దాటుతుంటారు. ఈ సినిమాకి కూడా అలానే జరగబోతుంది అని మరింత హైప్ క్రియేట్ చేశారు దేవ కట్టా.
అయితే ప్రతిసారి దేవకట్ట ఈవెంట్ కు వెళ్ళినా కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. దీనికి ఖచ్చితంగా రాజమౌళినే చెక్ పెట్టాలి. అయితే దేవ కట్టను ఏ ఫంక్షన్స్ కి వెళ్ళదు అని చెప్పాలి. లేకపోతే వారణాసి సినిమా గురించి ఎవరు ఏమీ అప్డేట్స్ అడగకండి అని ట్విట్టర్ వేదికగా అయిన చెప్పాలి.
Also Read: Ram Charan: కోఠి హాస్పిటల్ లో రామ్ చరణ్, ఇంతకు ఏమైంది?