Khaithi 2: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. రీసెంట్గా రజనీకాంత్ కూలి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత కార్తీతో సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కార్తి హీరోగా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో రూపొందుతున్న సినిమా ‘ఖైదీ 2’. 2019లో విడుదలైన ‘ఖైదీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వల్ గా ఖైదీ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ అప్డేట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్..
కార్తీ – లోకేష్ కనకరాజు కాంబోలో మరో మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతోనే ఆయనకు స్టార్ డైరెక్టర్ గుర్తింపు వచ్చింది. వరుసగా కమల్ హాసన్తో ‘విక్రమ్’ వంటి హిట్స్ అందుకున్నారు.. అయితే కూలీ తర్వాత ఈ ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్ళబోతుందని అందరు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మొత్తానికి ఇవాళ ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ పనిచేయబోతున్నారు. వచ్చే నెలలో సినిమా షూటింగ్ని మొదలు పెట్టబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని వినికిడి..
Also Read :తాప్సీ సినిమాలకు గుడ్ బై..? ఇంత షాకిచ్చిందేంటి భయ్యా..!
హీరో కార్తీ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఖైదీ మూవీ అతనికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఈ మూవీకి సీక్వల్ గా ఖైదీ 2 రాబోతుందని డైరెక్టర్ ప్రకటించిన తర్వాత కార్తీ ఈ సినిమాను చేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో బయటపెట్టాడు.. ఈ మూవీ షూటింగ్ కోసమే వేరే సినిమాలకు కమిట్ అవ్వలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా నీ కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేసి వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ఈ సినిమా కూడా అంతకుమించి వసూలను రాబడుతుందని కార్తీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజు సినిమాలను తెరకెక్కించడంతో పాటుగా హీరోగా కూడా సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త ఈమధ్య వినిపిస్తుంది. ఎలాంటి పాత్రలో కనిపించబోతాడు అని కోలీవుడ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఖైదీ 2 తర్వాత విక్రమ్ 2 సినిమాని తెరకెక్కించే ఆలోచనలో లోకీ ఉన్నట్లు టాక్..