E-Paper
Advertisement

Manchu Lakshmi: వాళ్లు లేకపోతే నేను లేను…ఎమోషనల్ అయిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: వాళ్లు లేకపోతే నేను లేను…ఎమోషనల్ అయిన మంచు లక్ష్మీ!
Advertisement

Manchu Lakshmi: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి(Manchu Lakshmi) ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఈమె యాంకర్ గా కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల దక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకోవడం కోసం విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచు లక్ష్మి మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

కష్టమొస్తే ఫ్రెండ్స్ ఉంటారు..

మంచు లక్ష్మి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన ఫ్రెండ్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. తనకు అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేదని జెండర్ గురించి ఆలోచించనని తెలిపారు. అందుకే తన ఫ్రెండ్స్ సర్కిల్ లో అబ్బాయిలు కూడా ఎక్కువగా ఉంటారని తెలిపారు. తాను తన జీవితంలో ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం తన స్నేహితులేనని మంచు లక్ష్మి వెల్లడించారు. నాకు ఏదైనా ఒక సలహా కావాలన్నా నేను ఏదైనా ఇబ్బందులలో ఉన్న నా ఫ్రెండ్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఈమె తెలిపారు. ఇక నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటికి వస్తున్నామని చెబితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందని వెల్లడించారు.

ముంబై వెళ్లి బాధపడ్డాను..

Advertisement

ఒకప్పుడు తాను ముంబై వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను ఇక్కడ ఎవరు లేరా? అనే భావన తనకు కలిగింది కానీ ఇప్పుడు ముంబై ఎవరు వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాం అంటూ మాట్లాడుతారు. అలా ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందని మంచు లక్ష్మి వెల్లడించారు. ఇలా ఫ్రెండ్స్ గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే హైదరాబాదులో స్థిరపడిన మంచు లక్ష్మి ఉన్నఫలంగా ముంబై వెళ్లి అక్కడే స్థిరపడిన సంగతి తెలిసిందే.

అమెరికా వదిలి రాకుండా ఉండాల్సింది..

Advertisement

ఇక ముంబైకి వెళ్లడానికి గల కారణాలను కూడా పలు సందర్భాలలో ఈమె తెలియజేశారు .తన కెరియల్ అలాగే తన కుమార్తె కెరియర్ కోసమే ముంబై వెళ్లానని ఈమె తెలియజేశారు. ఇక ముంబై వెళ్ళినా ప్రతి వీకెండ్ తాను హైదరాబాద్ వచ్చి ఇక్కడ వారందరితో సరదాగా గడుపుతానని మంచు లక్ష్మి ఈ సందర్భంగా తెలిపారు. కెరియర్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను అందరితో పంచుకున్నారు . తన జీవితంలో ఏదైనా రిగ్రేట్ గా ఫీల్ అయ్యే సంఘటనలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఎదురవడంతో ఈమె అమెరికా వదిలి ఇండియా రావడమే నేను చేసిన తప్పు అని అలా చేయకుండా ఉంటే బాగుండేదని ఇప్పటికి కూడా ఫీలవుతుంటాను అంటూ మంచు లక్ష్మి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన మంచు లక్ష్మి ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడడంతో ఇండియా వచ్చి తప్పు చేశానని పలు సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు..

Also Read: Manchu Lakshmi: మా కుటుంబం మొత్తం కలిసే ఉండాలి.. మంచు ఫ్యామిలీలో విభేదాలు తొలగి పోలేదా? 

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×