Manchu Vishnu: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సామాన్య ప్రజలను ఎంతటి భయాందోళనలకు గురిచేస్తున్నాయో మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన తాజా ఎక్స్ పోస్ట్ స్పష్టం చేస్తోంది. తన కుటుంబంతో కలిసి దుబాయ్లో ఉన్న సమయంలో ఎదురైన భయంకర అనుభవాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దుబాయ్లో తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న సమయంలో, ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం చూసి విష్ణు దిగ్భ్రాంతికి లోనైనట్లుగా తెలిపారు. ముఖ్యంగా క్షిపణులను అడ్డుకుంటున్న సమయంలో వెలువడిన భారీ శబ్దాలు తమ ఇంటిని సైతం కంపింపజేశాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ దుబాయ్లోనే నివాసం ఉంటున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. అమెరికా.. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై జరిపిన ఉమ్మడి దాడులకు ప్రతికారంగా టెహ్రాన్ తన క్షిపణి శక్తిని ప్రయోగించింది. శనివారం సాయంత్రం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు యూఏఈలోని అబుదాబీ.. దుబాయ్లతో పాటు ఖతార్ రాజధాని దోహా.. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరాలను తాకినట్లుగా తెలుస్తోంది. ఆ యుద్ధ దాడుల్లోనే మంచు విష్ణు ఫ్యామిలీ చిక్కుకున్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో చూస్తే.. ఆయన తలపై నుంచే క్షిపణి వెళుతోంది. ఈ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు..
Also Read- US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!
ఏ చిన్నారి కూడా తన ఇంటిపై యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు అని ఆయన పోస్ట్ చేసింది చూస్తుంటే.. ఈ భీకర శబ్దాలకు తన చిన్నారి కుమార్తె ఐరా ఎంతగా భయపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలపుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల కలిగే మానసిక ఆందోళనలు పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఒక తండ్రిగా ఆయన మాటల్లో తెలుస్తోంది. పౌరుల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న యూఏఈ (UAE) రక్షణ దళాలకు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణి దాడుల నుండి సామాన్యులను కాపాడుతున్న వారి తెగువను, ధైర్యాన్ని ఆయన కొనియాడారు.
Also Read- Ranabaali: విజయ్, రష్మికల పెళ్లి ఫొటోల కంటే.. ‘రణబాలి’ పాట ఫొటోలు భలే ఉన్నాయిగా!
అంతేకాదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే జీవితం ఎంత సున్నితమైనదో అర్థమవుతుందని విష్ణు పేర్కొన్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న క్షణంలోనే అనూహ్య మార్పులు సంభవిస్తాయని, అందుకే ప్రతి క్షణం విలువైనదని ఆయన గుర్తుచేశారు. చివరగా ‘హర హర మహాదేవ్’ అంటూ దైవస్మరణ చేస్తూ, అందరూ ధైర్యంగా ఉండాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన ప్రార్థించారు. ఇంతకు ముందు ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఈ యుద్ధ దాడుల నుంచి బయట పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ, ఆ ప్రదేశం నుంచి వెంటనే సురక్షిత ప్రదేశానికి రావాలని, క్షేమంగా ఇండియాకు వచ్చేయాలని ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు.. ఈ పోస్ట్కు కామెంట్స్ చేస్తున్నారు.
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
Also Read- Renu Desai: అమ్మవారి దుస్తుల్లో ఉన్న నన్ను.. ‘నైట్కు రేటు ఎంత?’ అని అడుగుతారా?