E-Paper
Advertisement

‘థగ్ లైఫ్’ దెబ్బకు రూటు మార్చిన మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయి పల్లవిలు బలికావల్సిందేనా

‘థగ్ లైఫ్’ దెబ్బకు రూటు మార్చిన మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయి పల్లవిలు బలికావల్సిందేనా
Advertisement

Mani Ratnam: మణి రత్నం…దళపతి,రోజా,బొంబాయ్,గీతాంజలి వంటి సినిమాలతో ఇండియన్ సినిమాపై చెరగని సంతకం చేసిన ఈ స్టార్ డైరెక్టర్ గత కొంతకాలంగా సక్సెస్ అడ్రస్ పట్టుకోలేకపోతున్నాడు.ముఖ్యంగా మణి నుండి వచ్చిన చివరి సినిమా ‘థగ్ లైఫ్’ ఎంత డిసప్పాయింట్ చేసిందో చెప్పక్కర్లేదు.నాయకుడు వంటి కల్ట్ ఫిలిమ్ తీసిన మణి మళ్ళీ కమల్ హసన్ తో సినిమా అంటే అంతకు మించి ఉంటుందని తెగ ఆశ పడ్డారు.కాని మించి కాదు కాదా టోటల్ ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ నే మంట గలిపెసింది.అయితే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాల్సిందే అంటూ అచ్చొచ్చిన లవ్ జానర్లో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడట మణి.

ఈ ప్రాజెక్ట్ మే 14న లాంఛనంగా

Advertisement

అందులో భాగంగా మద్రాస్ టాకీస్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి మోస్ట్ అవైటేడ్ స్టార్స్ కాంబోలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేశాడని,ఈ ప్రాజెక్ట్ మే 14న లాంఛనంగా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని అదే రోజు నుండి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేయనున్నారట.అయితే ఈ లోపే సినిమా పై ఒక స్పెషల్ ప్రోమో ని కట్ చేసి అఫీషియల్ గా మూవీ ని అనౌన్స్ చేస్తారని టాక్.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కలసి వచ్చిన రెహమాన్ నే మళ్ళీ తీసుకోబోతున్నాడట.అయితే ఇదే రెహమాన్ మణి కాంబోలో వచ్చిన భారీ అంచనాలతో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ తెలుగు,హిందీ మార్కెట్లలో అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.మరి ఈ ఆల్బమ్ ఏ మేరకి ఆకట్టుకుంటుందో చూడాలి.

also read:వచ్చే సంక్రాంతికి ‘నందమూరి’ ఊచకోత…బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్!

Advertisement

మణి మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోగలడా

ఇవన్ని ఇలా ఉంటె సాయి పల్లవి,విజయ్ సేతు పతిలు మణి రత్నం తో సినిమా చేస్తున్నారు అన్న వార్త రాగానే భయపడిపోతున్నారు ఫ్యాన్స్.అసలే సాయి పల్లవి కెరీర్ ఇపుడు గోల్డెన్ పీరియడ్‌లో ఉంది.ఒకవైపు తొలిసారిగా నటించిన హిందీ సినిమా ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ అవుతుంది,మరో వైపు రణ్‌బీర్ కపూర్‌ తో కలిసి నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రామాయణ’ పార్ట్-1 ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.ఇంతటి క్రేజీ లైనప్‌లో ఉన్న సాయి పల్లవి,వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం సినిమాను ఏరికోరి ఎంచుకోవడం అంటే ఏరి కోరి కెరీర్ ని బలి పెడుతున్నట్టే అన్న టాక్ వినిపిస్తుంది.అసలే అవుట్ డేటెడ్ అయిపోయిన మణి మళ్ళీ మునుపటి ఫామ్ ని అందుకోగలడా అన్నది పల్లు ఫ్యాన్స్ వేస్తున్న క్వశ్చన్.ఎందుకంటే దశాబ్దం కిందట వచ్చిన ‘‘ఓకే బంగారం’’తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అని అనుకుంటే అదే రొమాంటిక్ జానర్లో వచ్చిన చెలియాతో మళ్ళీ డిజాస్టర్ ని ఫేస్ చేసిన పరిస్థితి.

విజయ్ సేతుపతి మాస్ ఇమేజ్ ఎలా మ్యాచ్ చేస్తాడో

ఇక సాయిపల్లవితో జోడీ కడుతున్న విజయ్ సేతుపతి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.మణి రత్నం తీసిన ‘చెక్క చివంత వానం’లో విజయ్ నటించినప్పటికి ఇప్పటికీ విజయ్ సేతుపతి ఇమేజ్ కంప్లీట్ గా మారిన పరిస్థితి.మరి క్లాస్ గా కూల్ స్క్రీన్ ప్లే తో రొమాంటిక్ ఫిలిమ్స్ తీసే మణి విజయ్ సేతు పతి మాస్ ఇమేజ్ ని ఎలా మ్యాచ్ చేస్తాడా అంటూ ఆలోచనలో పడ్డారు తమిళ తంబీలు.ఇక విజయ్ సేతు పతి ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్’ చేస్తున్న సంగతి తెల్సిందే.చూడాలి మరి ఏరి కోరి ఎంచుకుంటున్న ఈ సాయి పల్లవి,విజయ్ సేతు పతిలు మణి రత్నం లవ్ స్టోరీకి ఏ మేరకు మ్యాచ్ అవుతారో.ఏది ఏమైనా ఒకప్పుడు కల్ట్ సినిమాలతో ఇండియన్ సినిమాని షేక్ చేసిన మణిపై ఇప్పుడిలా అవుట్ డేటెడ్ అంటూ రూమర్స్ రావడం బాధాకరమే.

also read:మధుబాల బయోపిక్..‘ఆ స్థాయిని కళ్యాణి ప్రియదర్శన్ అందుకోగలదా.. రిస్క్ చేస్తున్న భన్సాలీ ?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×