NTRNeel : కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత దానికి సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
ఇక ప్రస్తుతం తెలుగు హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్. బాహుబలి సినిమా తరువాత సరైన సక్సెస్ లేదు అనుకునే టైంలో ఈ సినిమా వచ్చింది. దాదాపుగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది సలార్. అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా లీకులు
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటించలేదు. జపాన్ ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూలో అనుకోకుండా ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమా పేరును డ్రాగన్ అని రివీల్ చేశాడు. చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్స్ కంటే కూడా, బయట వాళ్ళు ఈ సినిమా గురించి ఎక్కువగా లీక్ చేస్తున్నారు. అయితే లీక్ చేస్తుంది సెలబ్రిటీలు అవడం ఇంకా ఆశ్చర్యం.
రాజమౌళి ఏమో డ్రాగన్ టైటిల్ అని చెప్పేసాడు. పృధ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టవేనో థామస్, బీజూ మీనన్ ఉంటారు అని చెప్పేసాడు. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో శివ కార్తికేయ నటిస్తున్న సినిమా మదరాసి ఆ సినిమా తెలుగు ఈవెంట్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ రుక్మిణి వసంత్ హీరోయిన్ అని కన్ఫామ్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ఎక్కువ లీక్స్ ఇస్తున్నారు.
ఏమి చేయలేని పరిస్థితి
మామూలుగా తమ సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ బయటకు రిలీజ్ చేస్తే చిత్ర యూనిట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు సెలబ్రిటీలు లీక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ల మీద సరైన యాక్షన్ తీసుకోలేరు. అంతేకాకుండా ఆయా సెలబ్రిటీలు కూడా కావాలి అని కాకుండా తమకు తెలియకుండానే ఈ సినిమా గురించి చాలా విషయాలను చెప్పేస్తున్నారు. దీని విషయంలో చిత్ర యూనిట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా మీద అయితే మంచి అంచనాలు ఉన్నాయి. చాలావరకు ఈ సినిమా కోసం బరువు తగ్గాడు ఎన్టీఆర్.
Also Read: Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్