Vijay – Rashmika : మోస్ట్ బ్యూటిఫుల్ జంట విజయ్ దేవరకొండ రష్మిక రేపు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అఫీషియల్ గా ఎక్కడ ప్రకటించకుండా చివరి వరకు దాచిన ఈ జంట మొత్తానికి పెళ్లి గురించి బయట పెట్టేశారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ వివాహానికి ఉదయపూర్ లో వేదిక కానుంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండడంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఉదయపూర్ కి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఈ పెళ్లికి 100 మంది అతిథులు హాజరవుతున్నారని కథనాలొచ్చాయి. అయితే ఈ అతిథులలో ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ కుటుంబం కూడా హాజరు కానుందని సమాచారం.. తాజాగా అంబాని విమానం ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుటుంబం విజయ్ – రష్మికల పెళ్లికి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఆయన ఫ్యామిలీ విమానం ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం దైవదర్శనం కోసం మొక్కులు చెల్లించుకోవడం కోసం మాత్రమేనని తెలుస్తోంది. ఆలయంలో అంబానీ కుటుంబ సభ్యులు కనిపించడంతో ఆ ఫోటోలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. అంబాని కుటుంబం ఈ పెళ్లికి హాజరవుతున్నారు అన్నది కేవలం గాసిప్పే.. ఇందులో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.
Also Read :అఖిల్ ‘లెనిన్ ‘ మళ్ళీ వాయిదా..? అయ్యగారి సినిమా వచ్చేది అప్పుడేనా..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు బయట వినిపిస్తున్న సరే వీళ్ళు మాత్రం ఎక్కడా దొరకలేదు.. అంతేకాదు ఎంగేజ్మెంట్ జరిగింది అన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు.. ఈ పెళ్లిని చాలా ప్రైవేట్ గా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కేవలం ఈ పెళ్లికి వందమంది అతిధులు మాత్రమే రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, నటి ఆషికా రంగనాథ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రమే కనిపించారు. విజయ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా హాజరు కానున్నారని సమాచారం. ఇక అతిథులకు అరిటాకుల్లో భోజనం వడ్డించనున్నారు. ఆతిథ్యంలో భాగంగా కొబ్బరి నీళ్లను ఏర్పాటు చేశారు.. 26 ఫిబ్రవరి 2026న వివాహం జరుగుతుంది. సినీ పరిశ్రమలోని స్నేహితుల కోసం 4 మార్చి 2026న భారీ విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.. ఇప్పటికే రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్లను కూడా పంపించినట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఈ బ్యూటిఫుల్ జంట రేపటితో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.. ఈ వార్త ప్రస్తుతం విజయ్ అభిమానులకు పట్టలేని సంతోషాన్ని ఇస్తుంది. ఇక వీరిద్దరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఆమె అక్కడ రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.