Nagabandham: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మైథలాజికల్ యాక్షన్ డ్రామాల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలియంది కాదు. పురాణ గాథలను ఆధునిక సాంకేతికతతో జోడించి చెప్పే కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే, అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలను ఏర్పరచుకున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా, నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా, ప్రేక్షకులను ఒక సరికొత్త దైవిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల తేదీని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Couples Fights: దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలా? బెడ్రూమ్లో ఇలాంటి ఫోటోలు ఉంచి చూడండి!
తాజాగా విడుదలైన టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్లో ఒక పురాతన దేవాలయంలోని గర్భాలయంలో ఉన్న అపారమైన రహస్య నిధిని, ఒక భారీ నాగుపాము రక్షిస్తున్నట్లు చూపించారు. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, భారతదేశంలోని చారిత్రాత్మక విష్ణు ఆలయాల చుట్టూ అల్లబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం అని స్పష్టమవుతోంది. ఇక ఈ చిత్ర టీజర్ను ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల (Nagabandham Teaser Release Date) చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివుని మెడలోని ఆభరణమైన నాగరాజుకు, విష్ణుమూర్తి ఆలయాలలోని రహస్యాలకు ఉన్న సంబంధం ఏమిటనే ఆసక్తికర అంశం ఈ టీజర్లో రివీల్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులకు థియేటర్లలో ఒక మరపురాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఈ సినిమా ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read- Mrunal Dulquer Salman: మళ్లీ జంటగా సీతారామం జోడీ.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విరాట్ కర్ణ సరసన టాలెంటెడ్ బ్యూటీస్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ (కెజియఫ్ ఫేమ్) వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరా అద్బుతమైన విజువల్స్ని రాబడుతుందని, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ పురాతన ఆలయాల సెట్టింగ్స్ను కళ్లకు కట్టేలా నిర్మించారని, ఆర్సి ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని టీమ్ ఇప్పటికే ప్రకటించి ఉంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను వేగవంతంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ వేసవిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read- Hero Nandu: నా డౌట్స్ అతనితోనే షేర్ చేసుకుంటా.. ‘హ్రీం’ ఈవెంట్లో నందు!