E-Paper
Advertisement

స్పీడ్ పెంచిన నయనతార.. ఒకేసారి ఐదు భాషల్లో!

స్పీడ్ పెంచిన నయనతార.. ఒకేసారి ఐదు భాషల్లో!
Advertisement

Nayanthara:సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలు మారినా.. అదే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ.. నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న లేడీ సౌత్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అదే స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకొని వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా వరుస భాషలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఇప్పటికీ ఎప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

దశాబ్దాలు దాటుతున్నా బిజీగా మారుతున్న స్టార్ హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత దాదాపుగా అవకాశాలు తగ్గిపోతాయి. ఇక పిల్లలు పుట్టారు అంటే వారికి దర్శక నిర్మాతలు ప్రాధాన్యత కూడా ఇవ్వరు. అలాంటిది నయనతార వివాహం చేసుకోవడమే కాకుండా సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అయినా సరే ఈమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. అవకాశాలు ఈమెకు రెట్టింపు స్థాయిలో లభిస్తూ ఉండడం చూస్తే ఈమె అదృష్టానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.. ఇదిలా ఉండగా గత రెండు మూడు సంవత్సరాలుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార.. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చిరంజీవి సరసన మరోసారి హీరోయిన్గా నటించి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నయనతార.

ఏకంగా ఐదు చిత్రాలతో.. అగ్ర హీరోలతో సినిమాలు..

Advertisement

మరొకవైపు కన్నడలో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో ఐదు చిత్రాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది నయనతార. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నయనతార ఒకేసారి ఐదు భాషలలో అందులోను అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగా.. తమిళంలో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరొకటి షూటింగు జరుపుకుంటుంది. అలాగే మలయాళం లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కన్నడలో నయనతార నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అటు బాలీవుడ్ లో కూడా ఇప్పటికే షారుక్ ఖాన్ తో నటించిన ఈమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఏది ఏమైనా నయనతార ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.

బాలయ్య జోడీగా మళ్లీ అవకాశం..

ఇదిలా ఉండగా మరొకవైపు తెలుగులో 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సింహలో నయనతార తొలిసారి బాలయ్యకు జోడిగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పౌరాణిక చిత్రమైన శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటించారు. ఇక 2018లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ జంటగా నటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఏకంగా నాలుగవసారి జంటగా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బికె 111 సినిమాలో బాలయ్యకి జోడిగా నయనతార నటిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు వరుస అవకాశాలనందుకుంటూ నయనతార మరింత బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Advertisement

 

also read:ఏంటీ.. రాకాస కాంబో ఐదేళ్ల క్రితమే ఫిక్స్ అయ్యిందా.. నిహారిక లెటర్ లో మానసా శర్మ!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×